AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ అన్నదాత సమరోత్సాహం.. ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ర్యాలీలు

కేసీఆర్ సర్కారు తెచ్చిన నూతన రెవెన్యూ చట్టానికి తెలంగాణ రైతాంగం సంబరాలు చేసుకుంటోంది. నూతన రెవెన్యూ చట్టం బిల్లు అమోదం పొందినందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్నదాతలు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ లో భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఇక, కరీంనగర్ జిల్లా […]

తెలంగాణ అన్నదాత సమరోత్సాహం.. ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ర్యాలీలు
Venkata Narayana
|

Updated on: Sep 25, 2020 | 1:30 PM

Share

కేసీఆర్ సర్కారు తెచ్చిన నూతన రెవెన్యూ చట్టానికి తెలంగాణ రైతాంగం సంబరాలు చేసుకుంటోంది. నూతన రెవెన్యూ చట్టం బిల్లు అమోదం పొందినందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్నదాతలు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ లో భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఇక, కరీంనగర్ జిల్లా మానకొండూర్ లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభించారు.

వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామం నుంచి రాయపర్తి మండల కేంద్రం వరకు 1000 ట్రాక్టర్లు, 500 ఎడ్లబండ్లతో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ట్రాక్టర్ నడిపి రైతులను ఉత్సాహ పరిచారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రైతులు స్వచ్ఛందంగా ర్యాలీలు నిర్వహిస్తూ సంబురాలు జరుపుకుంటున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ కృతజ్ఞతను చాటుతున్నారు. ప్రభుత్వానికి తమ మద్దతు తెలుపుతున్నారు.