శాసన సభ మంగళవారానికి వాయిదా
తెలంగాణ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. సోమవారం ఉదయం 10 గంటలకు మొదలైన అసెంబ్లీ సమావేశాలు పలు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను మంగళవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
తెలంగాణ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. సోమవారం ఉదయం 10 గంటలకు మొదలైన అసెంబ్లీ సమావేశాలు పలు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను మంగళవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితి చట్ట సవరణ బిల్లు, విపత్కర వేళ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత బిల్లుకు, ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్ట సవరణ బిల్లుకు, భవన నిర్మాణ అనుమతులు, టీఎస్ బీపాస్, ప్రైవేటు యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం శాసనసభను రేపటికి వాయిదా వేస్తున్న స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
అంతకుముందు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ బీపాస్ బిల్లుపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. భారతదేశం పట్టణీకరణలో శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. దేశంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు మంత్రి కేటీఆర్. రాష్ర్టంలో 42 శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివాసముంటున్నారన్న మంత్రి.. పట్టణాల్లో సరైన మౌలిక వసతులు కల్పించాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు. పురపాలనలో సమూల మార్పులు తేవాలనే ఉద్దేశంతో నూతన పురపాలక చట్టాన్ని 2019లో తీసుకువచ్చామన్నారు. పట్టణ ప్రాంతాల్లో 100 శాతం పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీఎస్ బీపాస్ చట్టాన్ని తీసుకువస్తున్నామని కేటీఆర్ తెలిపారు.