AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్.. తబ్లీఘీ చీఫ్‌కు భారీ షాక్.. రంగంలోకి దిగిన ఈడీ..

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన తబ్లీఘీ జమాత్ ( మర్కజ్) మతపరమైన ప్రార్ధనల గురించి తెలిసిందే. కరోనా వైరస్‌ కేసులు దేశంలో పెరగడానికి ఈ సమావేశాలు కూడా ఓ కారణమన్న.. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వాధికారలే అన్నారు. ఇక ఈ సమావేశాలకు దేశం నలుమూల నుంచే కాకుండా.. విదేశాల నుంచి కూడా వేల సంఖ్యలో హాజరయ్యారు. అయితే వీరిలో పలువురికి కరోనా సోకడం.. వారంతా వారి వారి స్వస్థలాలకు వెళ్లడంతో.. కరోనా వైరస్ అన్ని రాష్ట్రాలకు పాకినట్లైంది. అయితే […]

బ్రేకింగ్.. తబ్లీఘీ చీఫ్‌కు భారీ షాక్.. రంగంలోకి దిగిన ఈడీ..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 16, 2020 | 9:47 PM

Share

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన తబ్లీఘీ జమాత్ ( మర్కజ్) మతపరమైన ప్రార్ధనల గురించి తెలిసిందే. కరోనా వైరస్‌ కేసులు దేశంలో పెరగడానికి ఈ సమావేశాలు కూడా ఓ కారణమన్న.. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వాధికారలే అన్నారు. ఇక ఈ సమావేశాలకు దేశం నలుమూల నుంచే కాకుండా.. విదేశాల నుంచి కూడా వేల సంఖ్యలో హాజరయ్యారు. అయితే వీరిలో పలువురికి కరోనా సోకడం.. వారంతా వారి వారి స్వస్థలాలకు వెళ్లడంతో.. కరోనా వైరస్ అన్ని రాష్ట్రాలకు పాకినట్లైంది. అయితే నిబంధనలకు విరుద్దంగా తబ్లీఘీ జమాత్‌ సమవేశాలను ఏర్పాటు చేయడమే కాకుండా.. విదేశీయులను కూడా ఈ సమావేశాల్లో పాల్గొనేలా చేయడంతో.. పోలీసులు తబ్లీఘీ జమాత్ చీఫ్ మౌలానా ముహమ్మద్ సాద్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

తాజాగా.. ఇప్పడు ఈడీ కూడా రంగ ప్రవేశం చేసింది. తబ్లీఘీ జమాత్ చీఫ్ మౌలానా ముహమ్మద్ సాద్‌పై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఢిల్లీ నిజాముద్దీన్‌లోని ఆరంతస్థుల మర్కజ్‌ భవనంలో.. గత మార్చి నెలలో మతపరమైన ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సమావేశానికి విదేశీయులు కూడా పెద్ద ఎత్తున రావడంతో.. వారి నుంచి ఈ సమావేశానికి వచ్చిన స్వదేశీయులకు చాలా మందికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో ఈ విషయమై ఢిల్లీ పోలీసులు మార్చి 31వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీని ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.

కాగా.. కరోనా మహమ్మారిని అరికట్టడంతో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. అంతకు ముందు ఢిల్లీ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున జనం గుమికూడవద్దంటూ హెచ్చరికలు జారీచేసింది. అయితే అయినప్పటికీ.. మర్కజ్ బిల్డింగ్‌లో తబ్లీఘీ జమాత్‌కు చెందినవారు పెద్ద ఎత్తున ఉన్నారు. దీనిపై నిజాముద్దీన్ పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు.. తబ్లీఘీ జమాత్ చీఫ్ మౌలానా ముహమ్మద్ సాద్‌తో పాటు.. మరో ఆరుగురిపై కేసు నమోదైంది.

Follow Us
ఎముకలకు బలాన్నిచ్చే కోడి కాళ్ల సూప్.. ఇలా తింటే ఎన్ని లాభాలో..
ఎముకలకు బలాన్నిచ్చే కోడి కాళ్ల సూప్.. ఇలా తింటే ఎన్ని లాభాలో..
బక్రీద్ పండుగ ఆ రోజు కాదు.. సెలవుపై అంతటా గందరగోళం..
బక్రీద్ పండుగ ఆ రోజు కాదు.. సెలవుపై అంతటా గందరగోళం..
ఐపీఎల్‌లో కోటీశ్వరుడు.. ఆటలో నిత్య దరిద్రుడు.. కట్‌చేస్తే.
ఐపీఎల్‌లో కోటీశ్వరుడు.. ఆటలో నిత్య దరిద్రుడు.. కట్‌చేస్తే.
మహిళా రైతుపై తోపుడుబండ్ల వ్యాపారుల దాడి..మామిడి పండ్లు రోడ్డుపాలు
మహిళా రైతుపై తోపుడుబండ్ల వ్యాపారుల దాడి..మామిడి పండ్లు రోడ్డుపాలు
కోళ్లగూడు క్లీన్ చేస్తుంటే ఊహించని సీన్.. ఎర్రతేలు వీపుపై ఏముందో
కోళ్లగూడు క్లీన్ చేస్తుంటే ఊహించని సీన్.. ఎర్రతేలు వీపుపై ఏముందో
హార్ట్ షేప్ సరస్సు..ఇంతటి అందం..దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఉందంటే..
హార్ట్ షేప్ సరస్సు..ఇంతటి అందం..దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఉందంటే..
ఇది కరెక్ట్ కాదు సార్.. సీఎం విజయ్ నిర్ణయాన్ని తప్పుబట్టిన విశాల్
ఇది కరెక్ట్ కాదు సార్.. సీఎం విజయ్ నిర్ణయాన్ని తప్పుబట్టిన విశాల్
తెలుగు రాష్ట్రాల్లో భగభగ మండే ఎండలు.. మరో 4 రోజుల పాటు..
తెలుగు రాష్ట్రాల్లో భగభగ మండే ఎండలు.. మరో 4 రోజుల పాటు..
వాస్తు : ఇంటికి దురదృష్టం తెచ్చే మొక్కలు ఇవే.. ఎక్కడ ఉన్నా నష్టమే
వాస్తు : ఇంటికి దురదృష్టం తెచ్చే మొక్కలు ఇవే.. ఎక్కడ ఉన్నా నష్టమే
వైభవ్ సూర్యవంశీకు ఆ బలహీనత.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్..!
వైభవ్ సూర్యవంశీకు ఆ బలహీనత.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్..!