AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్.. తబ్లీఘీ చీఫ్‌కు భారీ షాక్.. రంగంలోకి దిగిన ఈడీ..

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన తబ్లీఘీ జమాత్ ( మర్కజ్) మతపరమైన ప్రార్ధనల గురించి తెలిసిందే. కరోనా వైరస్‌ కేసులు దేశంలో పెరగడానికి ఈ సమావేశాలు కూడా ఓ కారణమన్న.. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వాధికారలే అన్నారు. ఇక ఈ సమావేశాలకు దేశం నలుమూల నుంచే కాకుండా.. విదేశాల నుంచి కూడా వేల సంఖ్యలో హాజరయ్యారు. అయితే వీరిలో పలువురికి కరోనా సోకడం.. వారంతా వారి వారి స్వస్థలాలకు వెళ్లడంతో.. కరోనా వైరస్ అన్ని రాష్ట్రాలకు పాకినట్లైంది. అయితే […]

బ్రేకింగ్.. తబ్లీఘీ చీఫ్‌కు భారీ షాక్.. రంగంలోకి దిగిన ఈడీ..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 16, 2020 | 9:47 PM

Share

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన తబ్లీఘీ జమాత్ ( మర్కజ్) మతపరమైన ప్రార్ధనల గురించి తెలిసిందే. కరోనా వైరస్‌ కేసులు దేశంలో పెరగడానికి ఈ సమావేశాలు కూడా ఓ కారణమన్న.. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వాధికారలే అన్నారు. ఇక ఈ సమావేశాలకు దేశం నలుమూల నుంచే కాకుండా.. విదేశాల నుంచి కూడా వేల సంఖ్యలో హాజరయ్యారు. అయితే వీరిలో పలువురికి కరోనా సోకడం.. వారంతా వారి వారి స్వస్థలాలకు వెళ్లడంతో.. కరోనా వైరస్ అన్ని రాష్ట్రాలకు పాకినట్లైంది. అయితే నిబంధనలకు విరుద్దంగా తబ్లీఘీ జమాత్‌ సమవేశాలను ఏర్పాటు చేయడమే కాకుండా.. విదేశీయులను కూడా ఈ సమావేశాల్లో పాల్గొనేలా చేయడంతో.. పోలీసులు తబ్లీఘీ జమాత్ చీఫ్ మౌలానా ముహమ్మద్ సాద్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

తాజాగా.. ఇప్పడు ఈడీ కూడా రంగ ప్రవేశం చేసింది. తబ్లీఘీ జమాత్ చీఫ్ మౌలానా ముహమ్మద్ సాద్‌పై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఢిల్లీ నిజాముద్దీన్‌లోని ఆరంతస్థుల మర్కజ్‌ భవనంలో.. గత మార్చి నెలలో మతపరమైన ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సమావేశానికి విదేశీయులు కూడా పెద్ద ఎత్తున రావడంతో.. వారి నుంచి ఈ సమావేశానికి వచ్చిన స్వదేశీయులకు చాలా మందికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో ఈ విషయమై ఢిల్లీ పోలీసులు మార్చి 31వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీని ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.

కాగా.. కరోనా మహమ్మారిని అరికట్టడంతో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. అంతకు ముందు ఢిల్లీ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున జనం గుమికూడవద్దంటూ హెచ్చరికలు జారీచేసింది. అయితే అయినప్పటికీ.. మర్కజ్ బిల్డింగ్‌లో తబ్లీఘీ జమాత్‌కు చెందినవారు పెద్ద ఎత్తున ఉన్నారు. దీనిపై నిజాముద్దీన్ పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు.. తబ్లీఘీ జమాత్ చీఫ్ మౌలానా ముహమ్మద్ సాద్‌తో పాటు.. మరో ఆరుగురిపై కేసు నమోదైంది.

Follow Us
జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో ఇంటర్న్‌షిప్‌లు!
జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో ఇంటర్న్‌షిప్‌లు!
కళ్లజోడు పెట్టుకునే పిల్లలకి ఈ కూర పెడితే.. కంటిచూపు సమస్యలు..
కళ్లజోడు పెట్టుకునే పిల్లలకి ఈ కూర పెడితే.. కంటిచూపు సమస్యలు..
ఈసారి 10 కాదు 14 జట్లు.. 2027 వన్డే వరల్డ్ కప్ డేట్స్ వచ్చేశాయ్
ఈసారి 10 కాదు 14 జట్లు.. 2027 వన్డే వరల్డ్ కప్ డేట్స్ వచ్చేశాయ్
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్కరోజే ఎంతంటే..?
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్కరోజే ఎంతంటే..?
ఏసీ కూలింగ్ ఎక్కువ రావడం లేదా.. ఈ చిన్న వాటర్ ట్రిక్ ట్రై చేయండి
ఏసీ కూలింగ్ ఎక్కువ రావడం లేదా.. ఈ చిన్న వాటర్ ట్రిక్ ట్రై చేయండి
కెమికల్స్ కలిపిన టమాటాలను ఇంట్లోనే ఎలా గుర్తించాలో తెలుసా..?
కెమికల్స్ కలిపిన టమాటాలను ఇంట్లోనే ఎలా గుర్తించాలో తెలుసా..?
9 సీట్ల వాహనంలో 40 మంది ప్రయాణం.. షాకైన జనాలు..నెట్టింట్లో వైరల్‌
9 సీట్ల వాహనంలో 40 మంది ప్రయాణం.. షాకైన జనాలు..నెట్టింట్లో వైరల్‌
ఆరోగ్య ప్రదాయిని పీతల చారు.. ఆ సమస్యలన్నీ తరిమికొట్టే పవర్‌ఫుల్!
ఆరోగ్య ప్రదాయిని పీతల చారు.. ఆ సమస్యలన్నీ తరిమికొట్టే పవర్‌ఫుల్!
ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేస్తే చాలు.. మీ చేతికి నెలకు రూ.21,000..!
ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేస్తే చాలు.. మీ చేతికి నెలకు రూ.21,000..!
తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్..
తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్..