కేసీఆర్‌ ఏపీ పర్యటన రద్దు

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By: Ram Naramaneni

Updated on: Oct 12, 2020 | 5:03 PM

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ విశాఖపట్నం పర్యటన రద్దయింది. బడ్జెట్‌ రూపకల్పన, మంత్రివర్గ విస్తరణ సన్నాహాల దృష్ట్యా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖలో శారదాపీఠం వార్షికోత్సవాలకు హాజరు కావాలని నిర్వాహకులు ఆయనను ఆహ్వానించగా మొదట్లో అంగీకరించారు. ఈ నెల 17 నుంచి కేంద్ర ఆర్థిక సంఘం తెలంగాణలో పర్యటించనుంది. సీఎంతో, అధికారులతో భేటీలు, పర్యటనలు జరగనున్నాయి. కీలకమైన ఈ పర్యటనను ఉన్నందువల్ల సీఎం గురువారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో ఆర్థిక సంఘానికి ఇవ్వాల్సిన నివేదిక […]

కేసీఆర్‌ ఏపీ పర్యటన రద్దు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ విశాఖపట్నం పర్యటన రద్దయింది. బడ్జెట్‌ రూపకల్పన, మంత్రివర్గ విస్తరణ సన్నాహాల దృష్ట్యా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖలో శారదాపీఠం వార్షికోత్సవాలకు హాజరు కావాలని నిర్వాహకులు ఆయనను ఆహ్వానించగా మొదట్లో అంగీకరించారు. ఈ నెల 17 నుంచి కేంద్ర ఆర్థిక సంఘం తెలంగాణలో పర్యటించనుంది. సీఎంతో, అధికారులతో భేటీలు, పర్యటనలు జరగనున్నాయి. కీలకమైన ఈ పర్యటనను ఉన్నందువల్ల సీఎం గురువారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో ఆర్థిక సంఘానికి ఇవ్వాల్సిన నివేదిక తయారీతోపాటు రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించే అంశంపై చర్చించనున్నారు. మంత్రివర్గ విస్తరణపై సీఎం ఇప్పటికే కసరత్తు చేశారు. ఈ నెల 15న విస్తరణ జరుగుతుందనే ప్రచారం  ఉంది.మంత్రివర్గ విస్తరణపై గురువారం స్పష్టత వచ్చే వీలుంది. సీఎం ఉన్నతస్థాయి సమావేశం తర్వాత ఇది వెల్లడవుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాని పక్షంలో మరో తేదీని ఆయన పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం విశాఖ పర్యటనను రద్దు చేసుకోవడం మంత్రివర్గ విస్తరణ వాదనకు బలం చేకూరుస్తుంది. ఆయన తరఫున ప్రశాంత్‌రెడ్డి విశాఖపట్నం వెళ్లనున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu