రీ పోలింగ్‌పై రేపు నిర్ణయం- ద్వివేది

ఎన్నికల్లో 25 హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నట్లు ఏపీ రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. వివిధ ఘటనల్లో ఇద్దరు చనిపోయారని అన్నారు. గురువారం పోలింగ్ టైం ముగిసిన అనంతరం ద్వివేది అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమా అనే విషయంపై శుక్రవారం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రీపోలింగ్‌పై రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. 7 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారని వారిపై కేసులు నమోదైనట్లు తెలిపారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్‌ […]

రీ పోలింగ్‌పై రేపు నిర్ణయం- ద్వివేది
Follow us

|

Updated on: Apr 11, 2019 | 8:38 PM

ఎన్నికల్లో 25 హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నట్లు ఏపీ రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. వివిధ ఘటనల్లో ఇద్దరు చనిపోయారని అన్నారు. గురువారం పోలింగ్ టైం ముగిసిన అనంతరం ద్వివేది అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమా అనే విషయంపై శుక్రవారం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రీపోలింగ్‌పై రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. 7 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారని వారిపై కేసులు నమోదైనట్లు తెలిపారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందన్నారు. సాయంత్రం 6 గంటలకు 75 శాతం పోలింగ్‌ నమోదయ్యిందని వెల్లడించారు. మొత్తం మీద పోలింగ్‌ శాతం 80 శాతం దాటవచ్చని అభిప్రాయపడ్డారు. కొన్ని చోట్ల ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పొరపాట్లు జరిగినట్టు తెలిపారు. పోలింగ్ 80 శాతం మేర జరగొచ్చని అంచనా. పోలింగ్‌కు మరింత సమయం కేటాయించాలన్న.. పార్టీల ఫిర్యాదులను జిల్లా కలెక్టర్లకు పంపించామని చెప్పారు.

వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..