AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓ వైపు కరోనా.. మరో వైపు చైనా.. రెండింటితో ఇబ్బంది పడుతున్న అక్కడి ప్రజలు..

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి గురించి తెలిసిందే. ప్రపంచ దేశాలన్నింటిని గజగజ వణికిస్తోంది ఈ వైరస్. ప్రపంచ దేశాలన్నీ.. ఇప్పుడు ఈ వైరస్‌తో యుద్ధం చేస్తున్నాయి. అయితే లధాఖ్‌లోని లేహ్ ప్రాంత ప్రజలు ఓ వైపు కరోనాతో భయపడుతూ జీవనం సాగిస్తూ..

ఓ వైపు కరోనా.. మరో వైపు చైనా.. రెండింటితో ఇబ్బంది పడుతున్న అక్కడి ప్రజలు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 25, 2020 | 4:31 PM

Share

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి గురించి తెలిసిందే. ప్రపంచ దేశాలన్నింటిని గజగజ వణికిస్తోంది ఈ వైరస్. ప్రపంచ దేశాలన్నీ.. ఇప్పుడు ఈ వైరస్‌తో యుద్ధం చేస్తున్నాయి. అయితే లధాఖ్‌లోని లేహ్ ప్రాంత ప్రజలు ఓ వైపు కరోనాతో భయపడుతూ జీవనం సాగిస్తూ.. మరోవైపు చైనా దుశ్చర్యలో కూడా వణికిపోతున్నారు. మార్చి 7వ తేదీన లేహ్‌లో తొలి కరోనా కేసులు నమోదయ్యాయి. టూరిస్టులుగా వచ్చిన ఇద్దరు ఇరాన్ దేశస్థులకు కరోనా సోకినట్లు తేలింది. అలా టూరిస్టులతో అక్కడ కరోనా మహమ్మారి ఎంటర్ అయ్యింది. ప్రస్తుతం జూన్ 22వ తేదీ వరకు లదాఖ్‌లో 847 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 557 కార్గిల్ ప్రాంతంలో నమోదవ్వగా.. 153 లేహ్ ప్రాంతలో నమోదయ్యాయి. అన్‌లాక్ 1.0 తర్వాత.. ఇక్కడ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం ఇక్కడ మళ్లీ లాక్‌డౌన్ కఠినంగా అమలు పరిచేందుకు రెడీ అయ్యింది. అటు వ్యాపారస్థులను కూడా రోటేషన్ పద్దతిలో దుకాణాలను తెరవాలని ఆదేశించారు లేహ్ జిల్లా అధికారులు. దీంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలావుంటే.. మరోవైపు చైనా చేస్తున్న అలజడితో కూడా వణికిపోతున్నారు. జూన్ 15వ తేదీన లదాఖ్‌లోని గాల్వాన్‌లోయ వద్ద జరిగిన ఘర్షణలో 20 భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత.. ఇక్కడ పరిస్థితులు హీటెక్కాయి. గత మే నెల నుంచి చైనా లధాఖ్, సిక్కిం ప్రాంతాల సరిహద్దుల్లో బార్డర్‌ దాటుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ కమంలో గాల్వాన్‌ లోయ వద్ద చోటుచేసుకున్న సంఘటనలతో ఇక్కడి ప్రజలు భయపడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని తెలియక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఓ వైపు కరోనా.. మరో వైపు చైనా.. మధ్యలో లేహ్ ప్రజలు అన్నట్లు మారింది.