AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే ఫ్యామిలీ..అయితేనేం చెరోదారి?

కుటుంబ రాజకీయాలు తెలుగు రాష్ట్రాలకు కొత్త కాదు. ఫ్యామిలీ అంతా ఒకే పార్టీలో ఉండడం ఒకటైతే.. ఒకే ఫ్యామిలీ మెంబర్స్ వేర్వేరు పార్టీల్లో కొనసాగడం.. కుటుంబ ప్రయోజనాల కోసం ఎవరి దారిలో వారు పనిచేయడం రెండోది. సరిగ్గా ఇప్పుడిదే అంశం సింహపురి రాజకీయాలల్లో చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీలో చిరకాలంగా కొనసాగుతున్న బీదా మస్తాన్ రావు.. సడన్‌గా వైసీపీలో చేరిపోయారు. శుక్రవారం నాడు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు రాజీనామా లేఖను పంపిన బి.ఎం.ఆర్., శనివారం నాడు వైసీపీ […]

ఒకే ఫ్యామిలీ..అయితేనేం చెరోదారి?
Rajesh Sharma
| Edited By: |

Updated on: Dec 07, 2019 | 5:33 PM

Share

కుటుంబ రాజకీయాలు తెలుగు రాష్ట్రాలకు కొత్త కాదు. ఫ్యామిలీ అంతా ఒకే పార్టీలో ఉండడం ఒకటైతే.. ఒకే ఫ్యామిలీ మెంబర్స్ వేర్వేరు పార్టీల్లో కొనసాగడం.. కుటుంబ ప్రయోజనాల కోసం ఎవరి దారిలో వారు పనిచేయడం రెండోది. సరిగ్గా ఇప్పుడిదే అంశం సింహపురి రాజకీయాలల్లో చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీలో చిరకాలంగా కొనసాగుతున్న బీదా మస్తాన్ రావు.. సడన్‌గా వైసీపీలో చేరిపోయారు. శుక్రవారం నాడు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు రాజీనామా లేఖను పంపిన బి.ఎం.ఆర్., శనివారం నాడు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనైతే పార్టీ మారారు.. కానీ ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ అయిన బీదా రవిచంద్ర పరిస్థితి ఏంటన్న చర్చ ఇప్పుడు జోరుగా జరుగుతోంది.

బీదా రవిచంద్ర, బీదా మస్తాన్ రావు ఇద్దరు సోదరులన్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న ఈ ఇద్దరు ఇప్పుడు రెండు వేర్వేరు పార్టీల్లో వున్నారు. అయితే, రవిచంద్ర భవిష్యత్ ఏంటన్నది ఇపుడు వినిపిస్తున్న ప్రశ్న. ఆయన టిడిపిలోనే కొనసాగుతారా? లేక సోదరుని బాటలో వైసీపీకి చేరతారా అన్న చర్చ మొదలైంది. రవిచంద్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లా టిడిపి అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. అదే సమయంలో ఎమ్మెల్సీగా శాసనమండలికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

అయితే.. ఇప్పుడు పార్టీ మారితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని ఆగుతున్నారా లేక టిడిపిలోనే స్థిరంగా కొనసాగడానికే ఇష్టపడుతున్నారా అన్నది చర్చనీయాంశం. బీదా సోదరులకు అక్వా ఇండస్ట్రీస్ వున్నాయి. ఈ వ్యాపారంలో సోదరులిద్దరు భాగస్వాములు. ఇటీవల వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన అక్వా సదస్సుకు బీదా మస్తాన్ రావు హాజరయ్యారు. దాంతో ఆయన పార్టీ మారతారన్న ప్రచారం అప్పుడే మొదలైంది. గత సంవత్సరం బీదా సోదరుల బిజినెస్ కేంద్రాలపై ఐటి దాడులు జరిగాయి. పలు కేసులు కూడా వారిపై నమోదైనట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో సోదరులిద్దరు చెరో పార్టీలో వుంటూ తమ వ్యాపారాలను పరిరక్షించుకుంటారన్న ప్రచారం కూడా మరోవైపు మొదలైంది. బీదా మస్తాన్ రావుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వారి యంగ్ ఏజ్‌లో సహ ఉద్యోగులు కావడంతో ఆ పరిచయంతో ఆయన పార్టీ మారి వుంటారని పలువురు భావిస్తున్నారు. మొత్తానికి బీదా ఫ్యామిలీ పాలిటిక్స్ ఇప్పుడు సింహపురి ప్రజలను తెగ ఆకర్షిస్తున్నాయి.

Follow Us