సుశాంత్ మరణంతో కలత చెందిన ఓ యువతి ఆత్మహత్య
బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం.. ఓ యువతిని ఆత్మహత్యకు ఉసిగొల్పేలా చేసింది. విశాఖపట్నం శ్రీహరిపురంకు చెందిన ఓ కుటుంబం బీహార్ నుంచి వలస వచ్చింది. వారి కుమార్తె అయిన 21 ఏళ్ల సుమన్ కుమారి ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఇంటి నుంచి బయటకు రాలేదు. టిక్ టాక్ వ్యసనంకు తోడు సుశాంత్ సింగ్ అంటే ఆమెకు ప్రాణం. అతని మరణానికి సంబంధించిన విజువల్స్ టిక్టాక్లో వైరల్ కావడంతో […]
బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం.. ఓ యువతిని ఆత్మహత్యకు ఉసిగొల్పేలా చేసింది. విశాఖపట్నం శ్రీహరిపురంకు చెందిన ఓ కుటుంబం బీహార్ నుంచి వలస వచ్చింది. వారి కుమార్తె అయిన 21 ఏళ్ల సుమన్ కుమారి ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఇంటి నుంచి బయటకు రాలేదు.
టిక్ టాక్ వ్యసనంకు తోడు సుశాంత్ సింగ్ అంటే ఆమెకు ప్రాణం. అతని మరణానికి సంబంధించిన విజువల్స్ టిక్టాక్లో వైరల్ కావడంతో ఆ యువతి డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. సుశాంత్ చనిపోయినప్పటి నుంచి ఇంట్లో కూడా ఎవరితోనూ మాట్లాడడం లేదని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వైద్యులకు చూపిద్దామని అనుకునేంతలో ప్రాణాలను తీసుకుందని తెలిపారు. ఈ క్రమంలో తన బెడ్రూంలోకి వెళ్లి ఉరివేసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.