AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YSR Statue: చిత్తూరు జిల్లాలో కలకలం.. వైయస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు

చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలంలో తీవ్ర కలకలం చోటు చేసుకుంది. ఓఎన్‌ కొత్తూరు గ్రామం శివారులో ఉన్న YSR విగ్రాహాన్ని గుర్తు తెలియని..

YSR Statue: చిత్తూరు జిల్లాలో కలకలం.. వైయస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు
Ysr Statue
Venkata Narayana
|

Updated on: Sep 24, 2021 | 11:34 AM

Share

YSR Statue: చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలంలో తీవ్ర కలకలం చోటు చేసుకుంది. ఓఎన్‌ కొత్తూరు గ్రామం శివారులో ఉన్న YSR విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా స్పాట్‌ నుంచి విగ్రహం కనిపించకుండా ఎక్కడికో పట్టుకెళ్లారు. ఇవాళ ఉదయం అటుగా వెళ్లిన వారికి విగ్రహం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విగ్రహాన్ని తొలగించిన వ్యక్తులను పట్టుకోవాలంటూ YCP కార్యకర్తలు ఆందోళనకు దిగారు. టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు విగ్రహాన్ని ఎవరు, ఎక్కడికి తీసుకెళ్లారన్న దానిపై ఆరా తీస్తున్నారు.

ఇదిలాఉండగా, ఏపీలోని అనేక ప్రాంతాల్లో ఘర్షణలు, కొట్లాటలకు దారితీస్తున్నాయి స్కూల్‌ చైర్మన్‌ ఎన్నికలు. చిత్తూరు, తూర్పుగోదావరి.. ఇవాళ నెల్లూరు.. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు కొండారెడ్డిపల్లిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. స్కూల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడడంతో వివాదం చెలరేగింది. ఇరువర్గాలు ఒకరిపై మరొకరు కర్రలతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.

Read also: Maharashtra: 29 కాదు.. మృగాళ్ళా తెగబడింది 33 మంది.. మహారాష్ట్ర ఘటనలో షాకింగ్ ఫ్యాక్ట్స్.!