AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakha Railway Zone: దశాబ్దాల కల.. విశాఖ రైల్వే జోన్‌ ప్రక్రియలో మరో ముందడుగు.. కేంద్రమంత్రి కీలక ప్రకటన..

ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కల ఎట్టకేలకు సాకారమవుతోంది. విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా ముందుకు సాగుతోంది. తాజాగా టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఎక్స్‌లో కీలక ప్రకటన చేశారు.

Visakha Railway Zone: దశాబ్దాల కల.. విశాఖ రైల్వే జోన్‌ ప్రక్రియలో మరో ముందడుగు.. కేంద్రమంత్రి కీలక ప్రకటన..
South Coast Railway Zone
Shaik Madar Saheb
|

Updated on: Nov 24, 2024 | 9:32 PM

Share

విశాఖపట్నంలో ప్రత్యేక రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తామని ఏపీ విభజన చట్టంలో హామీ ఇచ్చింది నాటి కేంద్ర ప్రభుత్వం. అయితే గత పదేళ్లుగా ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా జోన్‌ వ్యవహారం ముందుకు సాగలేదు. ఇటీవల ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించడంతో కేంద్రం నుంచి విశాఖ రైల్వేజోన్‌పై కదలిక వచ్చింది. తాజాగా విశాఖపట్నంలో జోనల్ కార్యాలయం నిర్మాణానికి టెండర్‌ ప్రక్రియను ప్రారంభించింది..రైల్వేశాఖ. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఎక్స్‌లో స్వయంగా ఈ విషయం ప్రకటించారు. దీంతో విశాఖ వాసుల్లో ఆనందం నెలకుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల29న విశాఖ పర్యటనకు వస్తున్నారు. ఉత్తరాంధ్రలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విశాఖ రైల్వే జోన్‌కు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారని చెబుతున్నాయి రైల్వే వర్గాలు.. ఈ క్రమంలోనే రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం.. విశాఖలో రైల్వేజోన్‌ ఏర్పాటుకు ఇప్పటికే 53 ఎకరాల భూమిని రైల్వేశాఖకు అప్పగించింది రాష్ట్రప్రభుత్వం. మొత్తం 11 అంతస్తుల్లో 149.16 కోట్ల వ్యయంతో జోనల్‌ కార్యాలయ నిర్మాణం చేపడుతోంది రైల్వేశాఖ.

టెండర్లు దాఖలు చేసేందుకు డిసెంబర్‌ 27 వరకూ గడువు విధించింది. టెండర్లు దక్కించుకున్నవాళ్లు రెండేళ్లలో పనులు పూర్తిచేయాలని రైల్వేశాఖ స్పష్టం చేసింది. అయితే భవనం పూర్తయ్యేవరకూ ఎదురు చూడకుండా తాత్కాలిక భవనాల్లో అయినా సౌత్‌కోస్ట్‌ జోన్‌ కార్యకలాపాలను ప్రారంభించాలని విశాఖ వాసులు కోరుతున్నారు..

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గత పదేళ్లలో ప్రఖ్యాత IITల్లో భారీగా బీటెక్‌ సీట్ల కోత.. కారణం ఇదే
గత పదేళ్లలో ప్రఖ్యాత IITల్లో భారీగా బీటెక్‌ సీట్ల కోత.. కారణం ఇదే
ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. అసలేం..
ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. అసలేం..
క్రిస్మస్ ఈ టేస్టీ డెజర్ట్స్ ట్రై చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
క్రిస్మస్ ఈ టేస్టీ డెజర్ట్స్ ట్రై చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
33 బంతుల్లో సెంచరీ.. కావ్యపాప పాకెట్ డైనమైట్ బీభత్సం
33 బంతుల్లో సెంచరీ.. కావ్యపాప పాకెట్ డైనమైట్ బీభత్సం
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?
తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు