మున్సిపల్ ఎన్నికల బరిలో ప్రణయ్ హత్య కేసు నిందితుడు

ఏడాదిన్నర క్రితం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ హత్య కేసు వ్యవహారం సంచలనం రేపిన విషయం తెలిసిందే. తమను కాదని అమృత, ప్రణయ్‌ను కులాంతర వివాహం చేసుకుందని ఆమె తండ్రి మారుతీరావు అతడిని హత్య చేయించాడు. ఇక ఈ కేసులో పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. వారంతా ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. వీరిలో ఎంఏ కరీం అనే వ్యక్తి ఒకరు కాగా.. ఈ నెలలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో అతడు నామినేషన్ దాఖలు చేయడం స్థానికంగా […]

మున్సిపల్ ఎన్నికల బరిలో ప్రణయ్ హత్య కేసు నిందితుడు
Follow us

| Edited By:

Updated on: Jan 12, 2020 | 8:51 PM

ఏడాదిన్నర క్రితం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ హత్య కేసు వ్యవహారం సంచలనం రేపిన విషయం తెలిసిందే. తమను కాదని అమృత, ప్రణయ్‌ను కులాంతర వివాహం చేసుకుందని ఆమె తండ్రి మారుతీరావు అతడిని హత్య చేయించాడు. ఇక ఈ కేసులో పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. వారంతా ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. వీరిలో ఎంఏ కరీం అనే వ్యక్తి ఒకరు కాగా.. ఈ నెలలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో అతడు నామినేషన్ దాఖలు చేయడం స్థానికంగా వివాదం రేపుతోంది.

ప్రణయ్ హత్య కేసులో కరీం ఐదో నిందితుడు కాగా.. కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు అతడు రెండు రోజుల క్రితం నామినేషన్ దాఖలు చేశాడు. అయితే గతంలో ఇతడు కాంగ్రెస్‌‌లో ఉండగా.. ఈ సారి పార్టీ బీ ఫారం ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. మిర్యాలగుడలోని 20, 21 వార్డుల నుంచి అతను కౌన్సిలర్‌గా పోటీ చేయబోతున్నాడు. అయితే అతడు నామినేషన్ దాఖలు చేయడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు.

Latest Articles