ప్రజా సమస్యలు పక్కన పెట్టి మొబైల్స్లో గేమ్స్.. ఆ అధికారుల తీరుకు అందరూ షాక్!
నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం అపహాస్యం పాలైంది. ప్రజల సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన ఈ సమావేశంలో అధికారులు మొబైల్ గేమ్స్ ఆడుతూ, ఫోన్ కాల్స్తో కాలక్షేపం చేశారు. ఉన్నతాధికారుల గైర్హాజరీ, కిందిస్థాయి సిబ్బందితో కార్యక్రమం మొక్కుబడిగా మారింది. ప్రజల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజావాణి లక్ష్యాలను నీరుగార్చకుండా ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
