Visakha MLC Election: మళ్ళీ మరో ఎన్నికకు సిద్ధమవుతున్న విశాఖ.. మరోసారి అభ్యర్థులు వాళ్లేనా..?

ఎమ్మెుల్యే వంశీ రాజీనామాతో ఖాళీ అయిన విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఇందుకోసం తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున లాబింగ్ జరుగుతోంది. 164 స్థానాలతో అధికారంలో వచ్చింది టీడీపీ. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఓటర్ల మద్దతు పొందడం సులభం అన్నది టీడీపీ నేతల అభిప్రాయం.

Visakha MLC Election: మళ్ళీ మరో ఎన్నికకు సిద్ధమవుతున్న విశాఖ.. మరోసారి అభ్యర్థులు వాళ్లేనా..?
Gandi Babji Amarnath
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jul 02, 2024 | 8:09 PM

ఎమ్మెుల్యే వంశీ రాజీనామాతో ఖాళీ అయిన విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఇందుకోసం తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున లాబింగ్ జరుగుతోంది. 164 స్థానాలతో అధికారంలో వచ్చింది టీడీపీ. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఓటర్ల మద్దతు పొందడం సులభం అన్నది టీడీపీ నేతల అభిప్రాయం. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే నేతల సంఖ్య పెరుగుతోంది. ఈ వరుసలో టీడీపీ నుంచి అవకాశం ఎవరికి వస్తుంది. కౌంటర్ గా వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో ఎవరిని దింపే అవకాశం ఉందన్న చర్చ ప్రస్తుతం పెద్ద ఎత్తున సాగుతోంది.

రాష్ట్రంలో సాధారణ ఎన్నికల హడావుడి ముగిసింది. మరోసారి మరో ఎన్నిక అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విశాఖ స్థానిక సంస్థల నుంచి 2021లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సిహెచ్ వంశీకృష్ణ యాదవ్ అనంతం మారిన పరిణామాల్లో పార్టీ వీడారు. 2023 డిసెంబర్‌లో అప్పటి అధికార పార్టీకి రాజీనామా చేయడంతో పాటు జనసేనలో చేరిపోయారు. అధికార పార్టీ అధినేత తోపాటు ఇతర నేతలను విమర్శించడంతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆయనకు కౌన్సిల్ చైర్మన్ నోటీసులు ఇవ్వడం, అనర్హత ప్రకటించడమే కాకుండా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని ఖాళీగా చూపించడం వరకు చకచకా జరిగిపోయాయి.

రెండు నెలలలోపే ఎన్నికలు

ఇది జరిగి ఇప్పటికీ దాదాపు నాలుగు నెలలుగా వస్తుంది. ఆరు నెలలలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ త్వరలో వీటిపై ఒక నిర్ణయాన్ని వచ్చే అవకాశం ఉంది. అంటే వీలైనంత త్వరలో రెండు నెలల్లోనే ఎన్నిక పూర్తి చేయాల్సి ఉండడంతో ఈ ప్రక్రియ వీలైనంత తొందరలో ప్రారంభమయ్యేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్నికలపై మరోసారి అందరి దృష్టి పడింది.

2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో దాదాపు 90 శాతానికి పైగా స్థానిక సంస్థలని అప్పటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. దీనిపై అప్పట్లోనే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. స్థానిక సంస్థల్లో దాదాపు అన్ని స్థానాలను కైవసం చేసుకోవడంతో వాటి ఆధారంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వచ్చారు. ఆ క్రమంలోనే విశాఖ స్థానిక సంస్థల నుంచి టీడీపీ ఎవరిని పోటీ కూడా దింపలేకపోయింది. దాంతో వంశీ యాదవ్ ఎన్నిక అప్పట్లో 2021లో ఏకగ్రీవమైంది.

అయితే మొదటి నుంచి ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యంతో ఉన్న వంశీ అసంతృప్తి గానే ఎమ్మెల్సీ తీసుకున్నారు. తదనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో రెండేళ్ల ఎమ్మెల్సీ పదవి తర్వాత 2023 డిసెంబర్‌లో వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన మూడు రోజుల తర్వాత తొమ్మిది పేజీల ఘాటైన లేఖను వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌కు రాస్తూ, పార్టీ విధానాల్ని తీవ్రంగా దుయ్యపట్టారు. అయితే ఎమ్మెల్సీ పదవికి మాత్రం తాను రాజీనామా చేయబోనని, తాను పడ్డ కష్టానికి ఇచ్చిన గుర్తింపు తప్పా.. వైఎస్ఆర్‌సీపీ నాకేమీ గంపగుత్తగా, ఉచితంగా ఈ పదవి ఇవ్వలేదంటూ వంశీ అప్పట్లో పెద్ద రాద్ధాంతమే చేశారు. కానీ జనసేనలో చేరి పార్టీ అధిష్టానం మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుండడంతో పార్టీ ఫిరాయింపుల కింద ఎమ్మెల్సీ పదవిని రద్దు చేస్తూ శాసనమండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. 2024 ఫిబ్రవరిలో దానికి సంబంధించి ఆ స్థానాన్ని ఖాళీ చూపిస్తూ గెజిట్ కూడా విడుదల చేశారు. ప్రస్తుతం జూలై నెల ప్రారంభంతో దాదాపుగా నాలుగు నెలలు ముగిశాయి మరో రెండు నెలల్లో ఈ స్థానానికి ఎన్నిక జరపాల్సి ఉంది. అందుకోసం అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలని తిరిగి ప్రారంభించాయి.

టీడీపీ నుంచి గండి బాబ్జీ కి ఛాన్స్

మారిన రాజకీయ పరిణామాలు నేపథ్యంలో టీడీపీ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీని ఎలాగైనా దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉంది. వాస్తవానికి మొత్తం ఓటర్లు 725 మంది వరకు ఉన్నారు. అందులో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటర్లుగా ఉన్న స్థానిక సంస్థల్లో టీడీపీకి 180 ఓట్లు మాత్రమే ఉండగా, మిగతా 545 వైసీపీకి ఉన్నాయి. అయితే వైసీపీకి స్పష్టమైన ఆధిక్యత దక్కే అవకాశం ఉంది కానీ, రాష్ట్రంలో 164 స్థానాలు దక్కించుకున్న ఎన్డీయే కూటమి ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా ఇకపై వైఎస్ఆర్ సీపీకి దక్కకుండా చేసే ఆలోచనలో వ్యూహం పన్నుతోందట. ఇప్పటికే వైసీపీతో ఉన్న 545 మంది స్థానిక సంస్థల ఓటర్లలో పలువురు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలు ఇవ్వగా, మరికొందరు పార్టీ మారకపోయినా అభ్యర్థిని బట్టి తెలుగుదేశంకి ఓటు వేసే అవకాశం కూడా ఉందన్న సంకేతాలు ఉన్నాయి. దీంతో సరైన అభ్యర్థి కోసం తెలుగుదేశం అన్వేషిస్తుంది.

అందులో ప్రధానంగా మొన్నటి ఎన్నికల్లో పొత్తుల లో భాగంగా తమ స్థానాలు కోల్పోయిన సమర్థులైన నేతలని ఎంపిక చేయాలని నిర్ణయించుకుంది. ఆ రకంగా పలువురు పేర్లు పరిశీలించినప్పటికీ, విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పార్టీ ఇంచార్జిగా ఉంటూ, పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ప్రతిపక్షంలో ఉంటూ పార్టీ అధినేత మన్ననలు పొందిన గండీ బాబ్జీపై టీడీపీ అధిష్టానం దృష్టి పడింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవిని వదిలేసి అదే దక్షిణ నియోజకవర్గం కు ఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీకే గండి బాబ్జి ఆ స్థానాన్ని త్యాగం చేసి ఉండడంతో.. వంశీ రాజీనామా చేసిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి గండి బాబ్జినే సరైన అభ్యర్థి అని తెలుగుదేశం భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి ఆయనకి విశాఖ అర్బన్ టీడీపీ అధ్యక్షుడిగా ఇచ్చినప్పటికీ, గతంలో పెందుర్తి ఎమ్మెల్యేగా, ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా గట్టి ఉన్న నాయకుడిగా గుర్తింపు ఉంది. గండి బాబ్జి అభ్యర్థిత్వానికి ఎక్కువ మంది మొగ్గు చూపే అవకాశం ఉండడంతో, ఆయననే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టాలని టీడీపీ భావిస్తున్నట్టు సమాచారం. దానికి తోడు అవసరమైతే ఆర్థిక వనరులను కూడా కూడగట్టుకుని, మెజార్టీ పొందేందుకు గండి బాబ్జి సమర్ధుడు అన్న ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్టు సమాచారం. అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ గండి బాబ్జి నే సరైన అభ్యర్థి అన్న సంకేతాలను టీడీపీ ఇస్తోంది.

వైఎస్ఆర్సీపీకి మెజార్టీ ఉన్నా.. గెలుపు అనుమానమే..!

అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రస్తుతం మెజారిటీ ఉన్నప్పటికీ పోటీ చేసేందుకు ఎవరు ముందుకు రాని పరిస్థితి. ఎందుకంటే 545 మంది ఓటర్లు ఉన్నప్పటికీ వారంతా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి ఓటేసే అవకాశం లేదు. వాళ్ళలో ఎక్కువ మంది పార్టీ మారేందుకు ఆసక్తి చూపుతున్నారట. మిగతా వాళ్ళు తమకు ఎన్నికల్లో చాలా ఖర్చులయ్యాయని, ఆ రకంగా ఆర్థిక సహకారం అందించిన వాళ్లకే ఓటేస్తామని చెప్పే ఆలోచనలో స్థానిక సంస్థల ఓటర్లు ఉన్నట్టు సమాచారం. అలాంటి సంకేతాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఆర్థికంగా కూడా కొంత భారాన్ని మోయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి కేవలం మాజీ మంత్రి అమర్‌నాథ్ ఒక్కడే ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారట. అమర్ కి అవకాశం ఇస్తే కొంతమేర టీడీపీ వ్యూహాలను నిలువరించే అవకాశం ఉంటుందన్న ఆలోచనలో ప్రతిపక్ష పార్టీ ఉన్నట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో అమర్ – గండి బాబ్జీ ల మధ్య పోటీ సాగితే, స్పష్టమైన ఆధిక్యం ఉన్న వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా..? లేదంటే 164 స్థానాలను గెలుచుకుని శత్రుదుర్భేద్యంగా ఉన్న టీడీపీనే ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటుందా? అదే సమయంలో ఎలాగైనా అసెంబ్లీకి వెళ్లాలన్న లక్ష్యంతో పనిచేసిన గండి బాబ్జి అసెంబ్లీకి వెళ్లలేకపోయినా చట్టసభల సభ్యుడిగా, కౌన్సిల్ కి వెళ్లే అవకాశం ఉందా అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంది..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

మౌత్‌ వాష్‌ సుధీర్ఘ కాలం వినియోగిస్తే క్యాన్సర్‌ ముప్పు ముంగిట్లో
మౌత్‌ వాష్‌ సుధీర్ఘ కాలం వినియోగిస్తే క్యాన్సర్‌ ముప్పు ముంగిట్లో
నటాషాకు ఏమైంది? హార్దిక్‌తో నిజంగానే విడిపోయిందా? పోస్ట్ వైరల్
నటాషాకు ఏమైంది? హార్దిక్‌తో నిజంగానే విడిపోయిందా? పోస్ట్ వైరల్
అంతరిక్షంలోకి ప్రధాని మోదీ.? గగన్‌యాన్‌ మిషన్‌పై ఇస్రో సమాచారం..
అంతరిక్షంలోకి ప్రధాని మోదీ.? గగన్‌యాన్‌ మిషన్‌పై ఇస్రో సమాచారం..
నేనే డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థినిః బైడెన్‌
నేనే డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థినిః బైడెన్‌
పిల్లలకు ఆశ్లీల కంటెంట్‌ కనిపించొద్దంటే.. ఫోన్ లో ఈ మార్పులు
పిల్లలకు ఆశ్లీల కంటెంట్‌ కనిపించొద్దంటే.. ఫోన్ లో ఈ మార్పులు
డయాబెటిస్‌ రోగులు పొద్దున్నే ఖాళీ కడుపుతో బార్లీ నీటిని తాగారంటే
డయాబెటిస్‌ రోగులు పొద్దున్నే ఖాళీ కడుపుతో బార్లీ నీటిని తాగారంటే
భర్త వేధింపులు తాళలేక ఏకంగా కేంద్రానికి మహిళ లేఖ..!
భర్త వేధింపులు తాళలేక ఏకంగా కేంద్రానికి మహిళ లేఖ..!
పెళ్లి కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత డబ్బు డ్రా చేసుకోవచ్చు? నిబంధనలు
పెళ్లి కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత డబ్బు డ్రా చేసుకోవచ్చు? నిబంధనలు
బీర్‌ తాగితే పొట్టపెరుగుతుందా? మద్యం మానేయకుండానే కొవ్వు కరగాలంటే
బీర్‌ తాగితే పొట్టపెరుగుతుందా? మద్యం మానేయకుండానే కొవ్వు కరగాలంటే
గుడ్ న్యూస్.. కల్కి టికెట్స్ రేట్స్ తగ్గుతున్నాయ్‌..!
గుడ్ న్యూస్.. కల్కి టికెట్స్ రేట్స్ తగ్గుతున్నాయ్‌..!
అంతరిక్షంలోకి ప్రధాని మోదీ.? గగన్‌యాన్‌ మిషన్‌పై ఇస్రో సమాచారం..
అంతరిక్షంలోకి ప్రధాని మోదీ.? గగన్‌యాన్‌ మిషన్‌పై ఇస్రో సమాచారం..
గుడ్ న్యూస్.. కల్కి టికెట్స్ రేట్స్ తగ్గుతున్నాయ్‌..!
గుడ్ న్యూస్.. కల్కి టికెట్స్ రేట్స్ తగ్గుతున్నాయ్‌..!
స్పెర్మ్‌ కౌంట్‌ పెంచే ఆహార పదార్థాలు.. అదిరిపోయే లిస్ట్.
స్పెర్మ్‌ కౌంట్‌ పెంచే ఆహార పదార్థాలు.. అదిరిపోయే లిస్ట్.
కిమ్‌ అరాచకం.. సాంగ్స్ విన్నాడని యువకుడికి బహిరంగ ఉరి.. వీడియో.
కిమ్‌ అరాచకం.. సాంగ్స్ విన్నాడని యువకుడికి బహిరంగ ఉరి.. వీడియో.
ఒక్కసారిగా రోడ్డుపై భారీ మొసలి ప్రత్యక్షం.. వాహనదారులు హడల్‌.!
ఒక్కసారిగా రోడ్డుపై భారీ మొసలి ప్రత్యక్షం.. వాహనదారులు హడల్‌.!
దానికదే గాల్లోకి ఎగిరిన చైనా రాకెట్‌.! పెద్దఎత్తున చెలరేగిన మంటలు
దానికదే గాల్లోకి ఎగిరిన చైనా రాకెట్‌.! పెద్దఎత్తున చెలరేగిన మంటలు
కేసీఆర్‌కు హైకోర్టు షాక్‌.! ఆ పిటిషన్‌ కొట్టివేత..
కేసీఆర్‌కు హైకోర్టు షాక్‌.! ఆ పిటిషన్‌ కొట్టివేత..
కొత్త క్రిమినల్‌ చట్టాల్లోని కీలక నిబంధనలు ఇవే..!
కొత్త క్రిమినల్‌ చట్టాల్లోని కీలక నిబంధనలు ఇవే..!
నడి రోడ్డుపై కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్.
నడి రోడ్డుపై కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్.
అదృష్టవశాత్తు తప్పిన ముప్పు.! ఊపిరి పీల్చుకున్న శాస్త్రవేత్తలు..
అదృష్టవశాత్తు తప్పిన ముప్పు.! ఊపిరి పీల్చుకున్న శాస్త్రవేత్తలు..