AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lock Down In AP: కర్ఫ్యూ సమయంలో విశాఖలో రోడ్లమీదకు భారీగా వస్తున్న జనం..పోలీసులు స్పెషల్ డ్రైవ్.. వాహనాలు సీజ్

Lock Down In AP : కరోనా వైరస్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తుంది. భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడమే కాదు.. మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండడంతో...

Lock Down In AP: కర్ఫ్యూ సమయంలో విశాఖలో రోడ్లమీదకు భారీగా వస్తున్న జనం..పోలీసులు స్పెషల్ డ్రైవ్.. వాహనాలు సీజ్
Visakha
Surya Kala
|

Updated on: Jun 01, 2021 | 10:33 PM

Share

Lock Down In AP : కరోనా వైరస్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తుంది. భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడమే కాదు.. మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండడంతో అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. ఈ నేపథ్యంలో గత నెల నుంచి ఏపీలో లాక్ డౌన్ కొనసాగుతూనే ఉంది. ఈ నెల 10 వరకూ ప్రభుత్వం లాక్ డౌన్ ను పొడిగించింది. అయితే ప్రభుత్వాలు, అధికారులు కొవిడ్ కట్టడి కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ప్రజల్లో స్వీయ క్రమ శిక్షణ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తమకు తామే కరోనా నుంచి రక్షణ కల్పించుకోవాల్సి ఉంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు బయటకు రమ్మనమని.. లేదంటే ఇంట్లోనే సేఫ్ గా ఉండమని అధికారులు ఎంతగానో ప్రజలకు చెబుతున్నారు. అయినప్పటికీ చాలామంది అధికారుల మాటలను పెడచెవిన పెట్టి..కర్ఫ్యూ ఉన్న సమయంలో చక్కర్లు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ నగర వ్యాప్తంగా ప్రధాన కూడల్లో రహదారులను పోలీసులు నిర్బంధించారు. ముఖ్యంగా 2 టౌన్ , ఎం ఆర్ పేట పరిధిలో తనిఖీలు చేపట్టారు.

కరోన వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన క్రమంలో కర్ఫ్యూ ఉన్న సమయంలో ప్రజలు రోడ్ల్ పైకి వస్తున్నరు కనుక తాము చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ అధికారులు చెప్పారు. ప్రభుత్వం సడలింపు ఇచ్చిన సమయంలో కాకుండా కర్ఫ్యూ సమయంలో నగర వాసులు అనవసరంగా రోడ్లు మీదకి రావడం పై నగర పోలీసులు ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించారు. అంతేకాదు విశాఖ నగరంలో ప్రధాన రహదారుల్లో వాహనాలు నిలిపివేసి.. వివరాల సేకరిస్తున్నారు. వాహనదారులు సరైన కారణం చెప్పలేకపోతుంటే పోలీసులు వారిపై కేసు నమోదు చేసి.. వాహనాలు సీజ్ చేస్తున్నారు.

Also Read: తెలంగాణాలో సీఎం నియోజకవర్గం నుంచి షర్మిల ఓదార్పు యాత్రకు రెడీ. సర్వత్రా ఆసక్తి