AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనకడుగు..! కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ.. కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్‌ కులస్తే కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదంటూ వ్యాఖ్యానించారు.

Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనకడుగు..! కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
Vizag Steel Plant
Shaik Madar Saheb
|

Updated on: Apr 13, 2023 | 12:35 PM

Share

వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ.. కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్‌ కులస్తే కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదంటూ వ్యాఖ్యానించారు. దానికంటే ముందు అర్ఎన్ఐఎల్ ను బలోపేతం చేసే పనిలో ఉన్నామంటూ పేర్కొన్నారు. పూర్తి స్థాయి సామర్ధ్యం మేరకు ప్లాంట్ పని చేసే ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. వీటిపై అర్ ఐ ఎన్ ఎల్ (RINL) యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామని తెలిపారు. కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్‌ కులస్తే గురువారం ఉదయం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను సందర్శించారు. అనంతరం యాజమాన్యంతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఫగ్గన్ సింగ్‌ కులస్తే మీడియాతో మాట్లాడుతూ.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లడం లేదంటూ పేర్కొన్నారు. అయితే, బిడ్ వేయ్యాలని తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపుతున్న విషయంపై కూడా ఫగ్గన్ సింగ్ మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడం ఒక ఎత్తుగడ మాత్రమేనంటూ వ్యాఖ్యానించారు. స్టీల్‌ప్లాంట్‌లో కొన్ని కొత్త విభాగాలు ప్రారంభిస్తున్నామని.. స్టీల్‌ప్లాంట్‌ను బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ముడిసరకు పెంపొందించే ప్రక్రియపై దృష్టి పెట్టామని కేంద్రమంత్రి ఫగ్గన్‌ తెలిపారు.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. బిడ్డింగ్ వేయాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్ దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. బిడ్ వేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని విశాఖకు సింగరేణి అధికారులను సైతం పంపించారు. ఈ తరుణంలో కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్‌ కులస్తే ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Follow Us