Andhra Pradesh: కొత్త కారులో అమ్మాయి.. ఫుల్లుగా మందు కొట్టి దూసుకెళ్లాడు.. కట్ చేస్తే.. రెండు ప్రాణాలు

కొత్త కారు.. ఫస్ట్‌ డ్రైవ్‌.. ఇక తగ్గేదేలే.. మనకెవ్వరూ అడ్డేలే.. అంటూ లాంగ్ డ్రైవ్ కి బయలుదేరాడు.. అప్పటికే ఫుల్లుగా మద్యం తాగాడు. కారులో ఇంకా మద్యం బాటిల్స్ ఉన్నాయి.. ఎఫ్‌ఆర్ కారులో మద్యం తాగుతున్నాడు.. రయ్యిరయ్యిన దూసుకెళ్తున్నాడు.. కట్ చేస్తే..

Andhra Pradesh: కొత్త కారులో అమ్మాయి.. ఫుల్లుగా మందు కొట్టి దూసుకెళ్లాడు.. కట్ చేస్తే.. రెండు ప్రాణాలు
Road Accident
Follow us

|

Updated on: Jul 21, 2024 | 7:54 AM

కొత్త కారు.. ఫస్ట్‌ డ్రైవ్‌.. ఇక తగ్గేదేలే.. మనకెవ్వరూ అడ్డేలే.. అంటూ లాంగ్ డ్రైవ్ కి బయలుదేరాడు.. అప్పటికే ఫుల్లుగా మద్యం తాగాడు. కారులో ఇంకా మద్యం బాటిల్స్ ఉన్నాయి.. ఎఫ్‌ఆర్ కారులో మద్యం తాగుతున్నాడు.. రయ్యిరయ్యిన దూసుకెళ్తున్నాడు.. కట్ చేస్తే.. ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టగా ఇద్దరు మృతి చెందారు..ఈ నెత్తుటి బీభత్సం కాకినాడలోని కల్పనా సెంటర్‌లో జరిగింది. కొత్త కారు ఇద్దరి ప్రాణాలను బలిగొన్నది. కారును కొన్న రామ్మోహన్‌ అనే వ్యక్తి.. మందుకొట్టి బీచ్‌ రోడ్డులో డ్రైవ్ చేశాడు.. యమా స్పీడులో ఉన్న కొత్త కారు అదుపుతప్పి రెండు బైక్స్‌ను ఢీకొట్టింది. ఆ స్పీడ్‌కి కారు కూడా పల్టీలు కొట్టింది. కారులో రామ్మోహన్‌తోపాటు, మరో యువతి కూడా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. తాగుబోతు డ్రైవింగ్‌తో ఇద్దరి నిండు ప్రాణాలు బలిగొనడంతోపాటు కొత్త కారు నుజ్జునుజ్జయింది. యాక్సిడెంట్‌ స్పాట్‌లో దృశ్యాలు దారుణంగా ఉన్నాయి.

మద్యం సేవించి ఎఫ్ ఆర్ కారులో లాంగ్ డ్రైవ్ కి వెళ్తున్న యువతీ, యువకుడు వెళ్తూ అదుపుతప్పి సిమెంట్ దిమ్మెను ఢీకొట్టిందని.. ఆ తర్వాత బైక్ ను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. బైక్ మీద వెళ్తున్న ఇద్దరు మృతిచెందగా.. కారులో ఉన్న వారికి గాయాలయ్యాయని.. చికిత్స కొనసాగుతుందని తెలిపారు. కారు ఢీకొట్టడంతో చనిపోయిన వారిని సతీష్‌, లక్ష్మణ్‌గా గుర్తించారు. రామ్మోహన్‌పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..