పాత నోట్ల మార్పిడి వెనుక రాజకీయ నేతల హస్తం..?
కర్ణాటకలో రూ. 400 కోట్ల విలువైన పాత 2000 నోట్ల కంటైనర్ చోరీ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సిట్ హవాలా ఆపరేటర్ విరాట్ గాంధీని అరెస్ట్ చేసింది. ఈ కేసులో హవాలా నెట్వర్క్లు, బిల్డర్లు, మత సంస్థలకు సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ డబ్బును ఎన్నికల ఖర్చులకు వినియోగించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది, జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తోంది.
కర్ణాటకలో 400 కోట్ల రూపాయల విలువైన పాత 2000 నోట్ల కంటైనర్ దొంగతనం కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఇంటర్స్టేట్ దోపిడీ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) విరాట్ గాంధీ అనే హవాలా ఆపరేటర్ను జనవరి 23న అరెస్ట్ చేసింది. రాజస్థాన్కు చెందిన విరాట్ గాంధీకి ఒక మత సంస్థతో సంబంధాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేయగా, థానేకు చెందిన ప్రముఖ బిల్డర్ కిషోర్ సాబ్లా, అజార్ అనే మరో ఇద్దరు నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: ఆ తప్పు రిపీట్ అవ్వదంటున్న అల్లు అర్జున్
ట్రెండ్ మారింది..స్పెషల్ సాంగ్ ట్రెండూ మారింది
చేజేతులా సినిమాలను నాశనం చేసుకుంటున్నారా
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్వా! డాక్టర్పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

