AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేవుడి సేవలో ‘కోట్ల’ సంపాదన..? తవ్వే కొద్దీ బయటపడుతున్న టీటీడీ డిప్యూటీ ఈవో అక్రమాలు!

తిరుమల తిరుపతి దేవస్థానంలో క్లర్క్‌గా చేరి డిప్యూటీ ఈవో స్థాయికి ఎదిగిన మెండు లోకనాథం అక్రమాస్తులు ఏసీబీ తనిఖీల్లో వెలుగుచూశాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ. 5 కోట్ల విలువైన ఆస్తులు బయటపడగా, బహిరంగ మార్కెట్‌లో దీని విలువ పదుల కోట్లలో ఉంటుందని అంచనా. దేవుడి సేవ పేరిట అడ్డగోలుగా కూడబెట్టిన ఈ సొత్తుపై దర్యాప్తు ముమ్మరమైంది. బినామీ ఆస్తులు, బ్యాంకు లావాదేవీలపై విచారణ కొనసాగుతోంది.

దేవుడి సేవలో ‘కోట్ల’ సంపాదన..? తవ్వే కొద్దీ బయటపడుతున్న టీటీడీ డిప్యూటీ ఈవో అక్రమాలు!
Ttd Deputy Eo Corruption
Sukumaar DG - Associate Editor
| Edited By: |

Updated on: Sep 04, 2026 | 6:57 AM

Share

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో క్లర్క్‌గా చేరి డిప్యూటీ ఈవో స్థాయికి ఎదిగిన మెండు లోకనాథం ఇంట్లో ఏసీబీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో దాదాపు 5 కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తులు వెలుగు చూశాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఈ మొత్తం తేలగా, బహిరంగ మార్కెట్లో దీని విలువ పదుల కోట్లలో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

తిరుపతితో పాటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు జరిగాయి. సుదీర్ఘ కాలంగా టీటీడీలో కీలక విభాగాల్లో పనిచేసిన సదరు అధికారి ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతోనే ఈ సోదాలు చేపట్టారు. సోదాల సమయంలో భారీగా స్థిరాస్తుల పత్రాలు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో విల్లాలు, ఖరీదైన ప్లాట్లు, వాణిజ్య సముదాయాలతో పాటు భారీ ఎత్తున వ్యవసాయ భూములు ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించారు.

బ్యాంకు లాకర్లలో భద్రపరిచిన నగదు, బంగారం నిల్వలను కూడా దర్యాప్తు బృందాలు వెలికితీశాయి. సాధారణ ఉద్యోగిగా జీవితం మొదలుపెట్టి ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులను ఏ విధంగా సమకూర్చుకున్నారనే దానిపై లెక్కలు తీస్తున్నారు. ఆదాయ వనరులకు మించి అక్రమ సంపాదనకు పాల్పడినట్లు ఆధారాలు లభించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. బినామీ పేర్లతో ఉన్న ఆస్తులు, బ్యాంకు ఖాతాల్లోని లావాదేవీలపై ప్రస్తుతం లోతైన విచారణ కొనసాగుతోంది. దేవుడి సేవ పేరిట అక్రమాలకు పాల్పడి అడ్డగోలుగా సంపాదించిన తీరు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులు, అనుమానితుల వివరాలను కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి కూడబెట్టిన సొత్తుపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని విచారణ అధికారులు స్పష్టం చేశారు. స్వాధీనం చేసుకున్న కీలక దస్తావేజులు, ఆస్తుల వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించి తదుపరి నివేదిక రూపొందిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us