AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parvathipuram Manyam: గిరిజనుల కష్టం పరులపాలు.. సీతాఫలాలకు గిట్టుబాటు ధరలేక ఇక్కట్లు!!

అడవినే నమ్ముకున్న గిరిజనులు ఆయా కాలాల్లో అడవిలో దొరికే

Parvathipuram Manyam: గిరిజనుల కష్టం పరులపాలు.. సీతాఫలాలకు గిట్టుబాటు ధరలేక ఇక్కట్లు!!
Organic Custard Apples
Follow us
G Koteswara Rao

| Edited By: Srilakshmi C

Updated on: Nov 08, 2024 | 11:33 AM

విజయనగరం, నవంబర్ 8: గిరిజనులు అధికంగా ఉండే జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా. ఈ జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండటంతో గిరిజనులు కూడా అటవీ ఉత్పత్తులను సేకరించి జీవనోపాధి పొందుతుంటారు. అలా సేకరించే ఉత్పత్తుల్లో పసుపు, చింతపండుతో పాటు పలు రకాల కాయగూరలు, పండ్లు ఉంటాయి. వాటిలో ఒక ప్రధానమైన ఉత్పత్తి సీతాఫలం. ఇక్కడ పండే సీతాఫలాలకు చాలా డిమాండ్ ఉంటుంది. రుచికి తీయగా ఉండటంతో పాటు కెమికల్స్ కలవకుండా సహజసిద్ధంగా పండటంతో వీటిని తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు సీతాఫల ప్రియులు. ఇవి సీజనల్ గా ఆగస్టు నుండి అక్టోబర్ వరకు అటవీ ప్రాంతంలో దొరుకుతుంటాయి. ఆ సమయంలో వాటిని సేకరించి వారపు సంతల్లో విక్రయిస్తుంటారు గిరిజనులు.

అలా ఎంతో కష్టపడి సేకరించిన సీతాఫలాలను గిరిజనులు సంతల్లో తక్కువ ధరకే అమ్ముతారు. సంతల్లోని వ్యాపారులు వద్ద నుండి కూడా మైదాన ప్రాంత వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తారు. అలా ఇక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసిన సీతాఫలాలను పట్టణాల్లో అధిక ధరకు విక్రయిస్తారు వ్యాపారులు. కెమికల్స్ లేని ఆర్గానిక్ కావడంతో మైదాన ప్రాంతంలో వీటికి అధిక గిరాకీ ఉంటుంది. ఈ సీతాఫలాల్లో విటమిన్ ఏ, బి, సి, కె, ప్రోటీన్, కాల్షియం, పాస్పరస్, మెగ్నీషియం, కాఫర్, ఫైబర్, ఐరెన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా యాంటి ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల క్యాన్సర్ రాకుండా దోహద పడుతుంది. సీతాఫలం తినడం వల్ల కంటి చూపు మెరగవ్వడంతో పాటు జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలో చెడు కొలస్ట్రాల్ ను బయటకు పంపి అధిక బరువును తగ్గిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న సీతాఫలాల పై అవగాహన ఉన్న నగరవాసులు వీటిని తినేందుకు అధికంగా ఆసక్తి చూపుతుంటారు.

అలాంటి సీతాఫలాలు ఎంతో కష్టపడి సేకరించి వారపు సంతల్లో తక్కువ ధరకు విక్రయిస్తున్నారు గిరిజనులు. వీరి వద్ద సేకరించిన సీతాఫలాలు నగరంలో అత్యధిక ధరకు దళారులు విక్రయిస్తున్నారు. ఈ సీతాఫలాలు మన్యం జిల్లా నుండి ఒడిశాలోని భువనేశ్వర్, కటక్, పూరి, పర్లాకిమిడితో పాటు పలు పట్టణాలకు ఎగుమతి అవుతుంటాయి. ప్రస్తుతం ఒక ట్రే ధర ఏడు వందల నుండి తొమ్మిది వందల వరకు ధర పలుకుతుంది. అయితే తక్కువ ధరకు విక్రయిస్తూ మోసపోతున్న గిరిజనులను మద్దతు ధర కల్పించి, ప్రభుత్వమే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు గిరిజనులు. గిరిజన ప్రాంతంలో సీతాఫల సాగు విస్తీర్ణం పెంచడంతో పాటు ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రోత్సాహకాలు కల్పించి యువతకు, స్థానిక గిరిజనులకు ఉపాధి కల్పించాలని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఢిల్లీ, కోల్‌కతా టీంలకు షాకింగ్ న్యూస్.. గాయాలతో దూరమైన ఇద్దరు
ఢిల్లీ, కోల్‌కతా టీంలకు షాకింగ్ న్యూస్.. గాయాలతో దూరమైన ఇద్దరు
తిరుపతి వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారా..? మీకో బంపర్‌ న్యూస్‌..
తిరుపతి వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారా..? మీకో బంపర్‌ న్యూస్‌..
జక్కన్న మహాభారతంపై మరోసారి చర్చ.. ఆ హీరో కూడా పక్కా అని క్లారిటీ.
జక్కన్న మహాభారతంపై మరోసారి చర్చ.. ఆ హీరో కూడా పక్కా అని క్లారిటీ.
34 ఏళ్లలో 57 సార్లు బదిలీ.. IAS అశోక్‌ ఖేమ్కా పదవీ విరమణ నేడే
34 ఏళ్లలో 57 సార్లు బదిలీ.. IAS అశోక్‌ ఖేమ్కా పదవీ విరమణ నేడే
ఫోక్సో కేసులో కోర్టు సినిమా స్టైల్ లో వాదోపవాదనలు.. క్లైమాక్స్‌లో
ఫోక్సో కేసులో కోర్టు సినిమా స్టైల్ లో వాదోపవాదనలు.. క్లైమాక్స్‌లో
ఈ ముగ్గురు హీరోయిన్స్ చాలా బిజీ.. చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయంటే
ఈ ముగ్గురు హీరోయిన్స్ చాలా బిజీ.. చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయంటే
మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా..?
మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా..?
Video: లైవ్ మ్యాచ్‌లో రింకూపై కుల్దీప్ షడన్ ఎటాక్.. కట్‌చేస్తే
Video: లైవ్ మ్యాచ్‌లో రింకూపై కుల్దీప్ షడన్ ఎటాక్.. కట్‌చేస్తే
ఆ హీరోయిన్ చేయాల్సిన సినిమాతో హిట్టుకొట్టిన తమన్నా..
ఆ హీరోయిన్ చేయాల్సిన సినిమాతో హిట్టుకొట్టిన తమన్నా..
అనాథ పిల్లల కోసం ఈ బిగ్ బాస్ బ్యూటీ ఏం చేసిందో తెలుసా? వీడియో
అనాథ పిల్లల కోసం ఈ బిగ్ బాస్ బ్యూటీ ఏం చేసిందో తెలుసా? వీడియో