AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Piyush Goyal: కరోనా విపత్కర సమయంలో భారత్‌ 150 దేశాలకు సాయం చేసింది : కేంద్ర రైల్వే శాఖ మంత్రి

Piyush Goyal: కరోనా కారణంగా భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు సైతం ఇబ్బందుల్లో పడిపోయాయి. కోవిడ్‌ కారణంగా ప్రధాన నరేంద్ర మోదీ సారథ్యంలో భారత ప్రభుత్వం తన శక్తిమే ప్రపంచదేశాలకు సాయం.

Piyush Goyal: కరోనా విపత్కర సమయంలో భారత్‌ 150 దేశాలకు సాయం చేసింది : కేంద్ర రైల్వే శాఖ మంత్రి
Subhash Goud
|

Updated on: Mar 13, 2021 | 6:03 PM

Share

Piyush Goyal: కరోనా కారణంగా భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు సైతం ఇబ్బందుల్లో పడిపోయాయి. కోవిడ్‌ కారణంగా ప్రధాన నరేంద్ర మోదీ సారథ్యంలో భారత ప్రభుత్వం తన శక్తిమే ప్రపంచదేశాలకు సాయం అందిస్తోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్‌ గోపాల్‌ అన్నారు. శనివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన తర్వాత కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. 130 కోట్ల మంది జనాభా గల భారతదేశం కరోనా కల్లోలం నుంచి అతి తక్కువ కాలంలోనే కోలుకుని ప్రపంచానికి తన సత్తా ఏమిటో చూపించిందని అన్నారు. కరోనా సమయం భారతదేశం ఏ ఒక్కరి మీద ఆధారపడలేదని, పైగా వైరస్‌పై పోరాటంలో భాగంగా మన దేశమే ప్రపంచ దేశాలకు సాయం చేసిందని మంత్రి పేర్కొన్నార. ‘వసుధైక కుటుంబం’ స్ఫూర్తితో ప్రధాని నరేంద్రమోదీ 150 దేశలకు కోవిడ్‌-19 మెడిసిన్‌ను అందించారని గోయల్‌ గుర్తు చేశారు. కరోనా మహమ్మారి ముప్పు ఇంకా పోలేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటివి పాటించాలని సూచించారు. అయితే ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్‌ అందే వరకు వేచి ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా కారణంగా ఆయా రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ వచ్చింది కదా అని ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. ఇప్పటికే కరోనాతో దేశమంత నష్టపోతోందని, ఇలాటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కరోనాను కట్టడి చేయాలని ప్రతి ఒక్కరు నిబంధనలు పాటిస్తే సరిపోతుందని అన్నారు.

ఇవీ చదవండి :

BREAKING, TTD: నిలిచిపోయిన టీటీడీ సర్వర్లు.. ఇబ్బందులు ఎదుర్కుంటున్న భక్తులు

శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల‌కు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌.. వాహనసేవల వివరాలు ఇవే..

Follow Us
పులి పంజా దెబ్బ ఎట్టుంటుందో తెల్సా..! కొడితే..
పులి పంజా దెబ్బ ఎట్టుంటుందో తెల్సా..! కొడితే..
మీన రాశిలోకి శుక్రుడు.. ఈ రాశులకు చెందిన మహిళలకు అదృష్టం..!
మీన రాశిలోకి శుక్రుడు.. ఈ రాశులకు చెందిన మహిళలకు అదృష్టం..!
బంగారం ధరలపై షాకింగ్ డెసిషన్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్
బంగారం ధరలపై షాకింగ్ డెసిషన్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్
అయ్యో ఎంత విషాదం.. దైవ దర్శనానికి వెళ్తుండగా దారికాచిన మృత్యువు
అయ్యో ఎంత విషాదం.. దైవ దర్శనానికి వెళ్తుండగా దారికాచిన మృత్యువు
కెమికల్స్ అవసరం లేదు!5 నిమిషాల్లో రాగి పాత్రలు మెరిపించే సీక్రెట్
కెమికల్స్ అవసరం లేదు!5 నిమిషాల్లో రాగి పాత్రలు మెరిపించే సీక్రెట్
'దిల్' సినిమా హీరోయిన్ గుర్తుందా? పెళ్లయ్యాక ఇలా మారిపోయిందేంటి?
'దిల్' సినిమా హీరోయిన్ గుర్తుందా? పెళ్లయ్యాక ఇలా మారిపోయిందేంటి?
రాత్రిపూట చపాతీ తింటే నిజంగా బరువు తగ్గుతారా..? అసలు నిజాలు..
రాత్రిపూట చపాతీ తింటే నిజంగా బరువు తగ్గుతారా..? అసలు నిజాలు..
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. అడై దోశ రెసిపీ
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. అడై దోశ రెసిపీ
ఫ్యాన్ స్పీడ్ సరిపోవట్లేదా?.. ఒక్కసారి వీటిని చెక్ చేయండి
ఫ్యాన్ స్పీడ్ సరిపోవట్లేదా?.. ఒక్కసారి వీటిని చెక్ చేయండి
ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్..అకౌంట్లలో డబ్బులు జమ!
ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్..అకౌంట్లలో డబ్బులు జమ!