Tirupati: తిరుమలలో కిడ్నాపైన బాలుడు ఎక్కడున్నాడు..? సీసీ కెమెరాల్లో కీలక ఆధారాలు

Tirupati: తిరుమలలో కిడ్నాపైన ఐదేళ్ల బాలుడు ఎక్కడున్నాడు..? రోజులు గడుస్తున్నా.. బాలుడి ఆచూకీ కనిపించడం లేదు. సీసీ కెమెరాల్లో మహిళను గుర్తించినా.. ఇప్పటి వరకూ ..

Tirupati: తిరుమలలో కిడ్నాపైన బాలుడు ఎక్కడున్నాడు..? సీసీ కెమెరాల్లో కీలక ఆధారాలు
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 04, 2022 | 5:07 PM

Tirupati: తిరుమలలో కిడ్నాపైన ఐదేళ్ల బాలుడు ఎక్కడున్నాడు..? రోజులు గడుస్తున్నా.. బాలుడి ఆచూకీ కనిపించడం లేదు. సీసీ కెమెరాల్లో మహిళను గుర్తించినా.. ఇప్పటి వరకూ కిడ్నాపర్‌ను ట్రేస్‌ చేయలేకపోయారు పోలీసులు. బాలుడి ఆచూకీ కనిపెట్టేందుకు నాలుగు స్పెషల్‌ టీమ్‌లు రంగంలోకి దిగి ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఏప్రిల్‌ 30న కిడ్నాపర్‌ మహిళ తిరుమలకు వచ్చినట్లు గుర్తించారు. ఈమె తమిళనాడుకు చెందిన మహిళగా పోలీసులు (Police) భావిస్తున్నారు. కాట్పడి రైలులో బాలుడితో కలిసి కిడ్నాపర్‌ ప్రయాణించినట్లు తెలుస్తోంది. దాంతో తిరుపతి నుండి ఓ ప్రత్యేక పోలీసు బృందం వేలూరు, కాట్పాడికి బయల్దేరారు. బాలుడి ఆచూకీని కనిపెడతామని పోలీసులు చెబుతున్నారు. అయితే సీసీ కెమెరాల ద్వారా కొన్ని ఆధారాలు లభించినా.. సదరు కిడ్నాప్ చేసిన మహిళ ఎక్కడుందో గుర్తించలేకపోతున్నారు పోలీసులు. మరోవైపు 72 గంటలు గడుస్తున్నా బాలుడి ఆచూకీ లేకపోవటంతో కన్నతల్లి .. కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తన కొడుకును ఎలాగైనా తనకు అప్పజెప్పి న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటోంది బాలుడి తల్లి.

కాగా, సోమవారం ఉదయం నుంచి తిరుమల పోలీసులు కిడ్నాపర్‌ ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఆదివారం రాత్రి బాలుడితో కలిసి ఆ మహిళ తిరుపతికి చేరుకుని గోవిందరాజస్వామిని దర్శించుకుంది. తర్వాత విష్ణునివాసంలో బస చేసి సోమవారం వేకువజామున 4.10 నుంచి 4.30 గంటల ప్రాంతంలో రైల్వేస్టేషన్‌లో టికెట్‌ కొనుగోలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ తర్వాత ఏ రైలెక్కి.. ఎక్కడికి వెళ్లిందనే విషయాలపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. నెల్లూరు లేదా కడపకు వెళ్లి ఉండవచ్చు అన్న నిర్ధారణకు వచ్చారు. కిడ్నాపర్‌ కోసం ఆరు బృందాలుగా ఏర్పడి కొందరు నెల్లూరు, మరికొందరు కడపకు వెళ్లారు. మధ్యలోని రైల్వేస్టేషన్లలోనూ కూడా విచారణ చేపడుతున్నారు. వీటితో పాటు రివర్స్‌ డైరెక్షన్‌లో సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అయితే కిడ్నాపర్‌ 30వ తేదీన మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో బస్సులో అలిపిరి చెక్‌పాయింట్‌కు చేరుకున్నట్టు ఫుటేజ్‌లో కనిపించింది. ఆ తర్వాత తిరుమలకు చేరుకుని వరాహస్వామి, నాదనీరాజనం మండపం వద్ద బస చేసినట్లు గుర్తించారు.

మరిన్ని తిరుమల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Special Trains: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. వేసవి సెలవుల్లో తిరుపతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు

Weather Alert: తెలంగాణలో వర్ష బీభత్సం.. అకాల వర్షానికి అన్నదాత విలవిల.. నేడు, రేపు భారీ వర్షాలు

మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?