AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

School Headmaster Beats Student:అమ్మఒడి ఇంకా రాలేదని ప్రశ్నించిన స్టూడెంట్.. చితకబాదిన హెడ్ మాస్టర్..

విశాఖ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కశింకోట మండలంలోని ఏనుగుతుని గ్రామంలో ఓ ఉపాద్యాయుడు తన దాష్టీకాన్ని ప్రదర్శించాడు. ప్రభుత్వం ఇస్తున్న అమ్మ ఒడి పథకం..

School Headmaster Beats Student:అమ్మఒడి ఇంకా రాలేదని ప్రశ్నించిన స్టూడెంట్.. చితకబాదిన హెడ్ మాస్టర్..
Surya Kala
|

Updated on: Feb 04, 2021 | 1:06 PM

Share

School Headmaster Beats Student: విశాఖ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కశింకోట మండలంలోని ఏనుగుతుని గ్రామంలో ఓ ఉపాద్యాయుడు తన దాష్టీకాన్ని ప్రదర్శించాడు. ప్రభుత్వం ఇస్తున్న అమ్మ ఒడి పథకం ఇంకా రాలేదు అని అడిగిన ఓ విద్యార్థిని హెడ్ మాస్టర్ చితకబడినట్లు తెలుస్తోంది. ఆ స్టూడెంట్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడని సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రభుత్వం దృష్టికి చేరింది. వెంటనే స్పందించిన విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

అమ్మఒడి పథకం ఆంధ్రప్రదేశ్ లోని పేద తల్లి విద్యార్థులకు ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టింది. సీఎం జగన్ 2020, జనవరి, 9న చిత్తూరు జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి,ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివించే పిల్లలకు అమ్మ ఒడి పధకం వర్తిస్తుంది. ఆర్థిక సాయం కింద ఏడాదికి రూ.15,000 ఆర్థిక సహాయం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయించింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియేట్ స్ధాయి వరకు ఉన్న విద్యార్థులందరికీ ఈ అమ్మఒడి పధకం వర్తిస్తుంది.

Also Read:

హైకోర్టును కర్నూలుకు తరలిస్తున్నారా?”.. జీవీఎల్‌ ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం..

పంచాయతీ ఎన్నికలపై ఆ పిటిషన్‌ను కొట్టి వేసిన ఏపీ హైకోర్టు.. పిటిషనర్‌ వాదనతో ఏకీభవించని ధర్మాసనం