AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu Naidu: తెలుగు ప్రజల పౌరుషం ఎన్టీఆర్.. జగన్ ఆ విషయాన్ని తెలుసుకోవాలి: చంద్రబాబు

చంద్రబాబు ఒంగోలులోని అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Chandrababu Naidu: తెలుగు ప్రజల పౌరుషం ఎన్టీఆర్.. జగన్ ఆ విషయాన్ని తెలుసుకోవాలి: చంద్రబాబు
Shaik Madar Saheb
|

Updated on: May 28, 2022 | 1:35 PM

Share

TDP Mahanadu 2022: తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు నందమూరి తారక రామారావు రాజకీయాల్లోకి వచ్చారని.. తెలుగు ప్రజల పౌరుషం ఎన్టీఆర్ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పేదవారికి, సామాన్యులకు ఏం కావాలో తెలుసుకొని.. అందరికీ సమన్యాయం చేసిన మహా వ్యక్తి ఎన్టీఆర్ అంటూ చంద్రబాబు కొనియాడారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి (NTR Birth Anniversary) ఉత్సవాల్లో భాగంగా.. చంద్రబాబు ఒంగోలులోని అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకముందు టీడీపీ శ్రేణులతో కలిసి భారీ వాహన ర్యాలీతో చంద్రబాబు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను కట్‌ చేసి.. చంద్రబాబు మాట్లాడారు.

తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చారని.. పేదవారికి ఏం కావాలో తెలుసుకుని అందించిన మహా వ్యక్తి అని కొనియాడారు. ఒంగోలులో అభివృద్ధి జరిగిందంటే దామచర్ల జనార్దన్‌ కృషేనంటూ టీడీపీ నేత పేర్కొన్నారు. మహానాడులో భాగంగా సాయంత్రం బహిరంగ సభలో రాష్ట్రం, జిల్లా సమస్యలను ప్రస్తావిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. మహానాడు సభకు ఎవరూ రాకుండా ఉండాలని బస్సులకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. సభకు రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా.. సాయంత్రం జరిగే బహిరంగ సభకు ఎంతమంది వస్తారో చూడండి అంటూ సవాల్ చేశారు. తప్పుడు రాజకీయాలను రాష్ట్ర ప్రజలు ఆమోదించరని.. ఈ విషయాన్ని జగన్‌ తెలుసుకోవాలని సూచించారు.

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా మహానాడు రెండో రోజున భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఒంగోలులోని మండువవారిపాలెంలో మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ మహానాడు భారీ బహిరంగ సభ ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!