AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దొంగ స్వామీజీ చీటింగ్‌.. అధిక వడ్డీ ఆశచూపి.. రూ. 25 కోట్లు కుచ్చుటోపీ

పేద, మధ్య తరగతి ప్రజలకు పొదుపు చేసుకునేంత సంపాదన ఉండదు. వచ్చిన దాంట్లో ఖర్చులకు పోగా ఎంతోకొంత వెనకేసుకోవాలని భావిస్తుంటారు. అందుకోసం తాముండే ప్రాంతంలో చిన్నమొత్తాల్లో..

దొంగ స్వామీజీ చీటింగ్‌.. అధిక వడ్డీ ఆశచూపి.. రూ. 25 కోట్లు కుచ్చుటోపీ
Fraud
Ganesh Mudavath
|

Updated on: Mar 04, 2022 | 5:44 PM

Share

పేద, మధ్య తరగతి ప్రజలకు పొదుపు చేసుకునేంత సంపాదన ఉండదు. వచ్చిన దాంట్లో ఖర్చులకు పోగా ఎంతోకొంత వెనకేసుకోవాలని భావిస్తుంటారు. అందుకోసం తాముండే ప్రాంతంలో చిన్నమొత్తాల్లో చిట్టీలు వేస్తుంటారు. కొందరు వేలల్లో చిట్టీలు(Chitfunds) కడితే.. మరికొందరు కాస్త ధైర్యం చేసి లక్షల్లో వేస్తుంటారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లకు పైసాపైసా కూడబెట్టి నెలనెలా చిట్టీలు కడుతుంటారు. ఈ క్రమంలో డబ్బు విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుత కాలంలో చిట్టీలు, స్కీం లు, ఆఫర్ లు వంటి వాటితో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. తియ్యగా మాటలు చెప్పి దగ్గరవుతున్నారు. జనాల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు(Cheating). సరైన సమయం చూసుకుని డబ్బుతో ఉడాయిస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా(Chittoor district)లో ఇలాంటి ఘటనే జరిగింది. బంగారుపాళెంలో ఓ దొంగ స్వామీజీ అధిక వడ్డీ ఆశ చూపి పలువురి నుంచి చిట్టీలు కట్టించుకున్నాడు. ఇలా వారి నుంచి రూ.25కోట్లు వసూలు చేసి రాత్రికి రాత్రే పరారయ్యాడు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో దొంగ స్వామీజీపై పలు సెక్షన్ల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రకాశం జిల్లా గండికోట ఆంజనేయులు అలియాస్ సాయినాథ్ చౌదరి.. పదిహేనేళ్ల క్రితం చిత్తూరు జిల్లా బంగారుపాళేనికి వచ్చాడు. స్థానికంగా ఉన్న ఓం శక్తి ఆలయంలో పూజారిగా చేరి, గుడిలో మాల ధరించే మహిళా భక్తులతో లక్షలాది రూపాయల చీటీలు వేయించి మోసం చేశాడు. ఇలా రూ.25 కోట్లు వసూలు చేశాడు. వారం క్రితం ఇంటికి తాళం వేసి భార్యా పిల్లలతో సహా రాత్రికి రాత్రే పరారయ్యాడు. విషయం తెలుసుకునన్న బాధితులు.. తాము మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. చీటీల ముసుగులో మోసం చేసి పరారైన దొంగ స్వామీజీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దొంగ బాబాను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఐపీసీ సెక్షన్‌ 420, 406, వివిధ చట్టాల ఆధారంగా కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న స్వామిజీ కోసం గాలింపు చేపట్టారు.

Also Read

Seema Chinthakayalu: ఈ కాయలు ఎప్పుడైనా తిన్నారా..? సూపర్ టేస్టే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా బెస్ట్..

NIO Kochi jobs 2022: కొచ్చిలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ ఉద్యోగాలు.. అర్హతలివే!

CM KCR Jharkhand Tour Live: తగ్గేదే లే..!జార్ఖండ్ లో తెలంగాణ సీఎం క్రేజ్.. దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ ఫ్లెక్సీలు.. ..(వీడియో)

Follow Us
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. TG EAPCET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. TG EAPCET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
బాల్యం అంటే ఆటపాటలు మాత్రమే కాదు..!
బాల్యం అంటే ఆటపాటలు మాత్రమే కాదు..!
బ్యాంక్ ఖాతాదారుడు మరణిస్తే నామినీ ఎప్పటిలోగా డబ్బులు తీసుకోవాలి
బ్యాంక్ ఖాతాదారుడు మరణిస్తే నామినీ ఎప్పటిలోగా డబ్బులు తీసుకోవాలి
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా