ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా కర్టెన్రైజర్ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి జగన్ ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. అందుకోసం ఢిల్లీ పయనమయ్యారు. ఢిల్లీ లీలా ప్యాలెస్ హెటల్లో దౌత్యవేత్తలతో సీఎం జగన్ సమావేశమవ్వాల్సి ఉంది. అయితే ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్ అయిన వెంటనే గన్నవరం నుంచి తాడేపల్లి వెళ్లిపోయారు జగన్. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన బధువారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నట్లు తాజా సమాచారం అందుతుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..