AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మావూళ్ళమ్మకు జేష్ఠమాసంలో జాతర.. ఆశాఢంలో ప్రత్యేక అలంకరణ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు..

భీమవరం మావుళ్ళమ్మకు నెల రోజులపాటు వైభవంగా జేష్ఠ మాస జాతర ప్రతియేటా నిర్వహిస్తారు. భీమవరం ప్రజలు తమ ఇలవేల్పుగా మావుళ్ళమ్మను కొలవటం ఆనవాయితీగా వస్తోంది. నిత్యం ఒంటినిండా బంగారంతో మెరిసిపోతూ భక్తులను అనుగ్రహిస్తున్న తల్లి మావుళ్ళమ్మ. మావుళ్ళమ్మ అమ్మవారికి జ్యేష్ఠ మాస జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

మావూళ్ళమ్మకు జేష్ఠమాసంలో జాతర.. ఆశాఢంలో ప్రత్యేక అలంకరణ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు..
Bheemavaram
B Ravi Kumar
| Edited By: |

Updated on: Jun 28, 2024 | 4:28 PM

Share

భీమవరం మావుళ్ళమ్మకు నెల రోజులపాటు వైభవంగా జేష్ఠ మాస జాతర ప్రతియేటా నిర్వహిస్తారు. భీమవరం ప్రజలు తమ ఇలవేల్పుగా మావుళ్ళమ్మను కొలవటం ఆనవాయితీగా వస్తోంది. నిత్యం ఒంటినిండా బంగారంతో మెరిసిపోతూ భక్తులను అనుగ్రహిస్తున్న తల్లి మావుళ్ళమ్మ. మావుళ్ళమ్మ అమ్మవారికి జ్యేష్ఠ మాస జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మావుళ్ళమ్మ అమ్మవారికి రెండుసార్లు ఘనంగా ఉత్సవాలు జరిపిస్తుంటారు. సంక్రాంతి మరుసటి రోజు నుండి నెల రోజులు ఉత్సవాలు జరుగుతాయి. మరొకసారి జేష్ఠ మాసం నెల రోజులు ఉత్సవాలు జరుగుతాయి. ఆషాఢ మాసం పౌర్ణమి రోజున అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరిస్తారు. దసరా 10 రోజులు వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరించి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుపుతారు. జ్యేష్ఠ మాసంలో మావుళ్ళమ్మ అమ్మవారు భీమవరంలో సంచరిస్తారని భక్తల విశ్వాసం.‌ అందుకే జ్యేష్ఠ మాసంలో అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. సారె సమర్పిస్తారు.

ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిస్సా నుండే కాకుండా దేశం నలుమూలల నుండి భక్తులు మావుళ్ళమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించేందుకు వస్తుంటారు. మావుళ్ళమ్మ అమ్మవారి జ్యేష్ట మాసం జాతర మహోత్సవాలు దేవస్థానంతోపాటూ నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా అమ్మవారి జేష్ఠ మాసం జాతర ఘనంగా జరిపారు. దేవస్థాన ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లిఖార్జునశర్మ అధ్వర్యంలో అర్చక బృందం మావుళ్ళమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజులు నిర్వహించి సాంప్రదాయానుసరం ఉత్సవ మూర్తిని ప్రత్యేకంగా అలంకరించిన పూల రధంపై ఉంచారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయలు కొబ్బరికాయ కొట్టి అమ్మవారి నగరోత్సవము ప్రారంభించారు. జాతర మహోత్సవము నిర్వహణ నిమిత్తం రెండు లక్ష రూపాయిలు ఎమ్మెల్యే రామాంజనేయులు చేతుల మీదుగా నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటికి అందజేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్