AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రాణం మీదకు తెచ్చిన గుర్రపు స్వారీ సంప్రదాయం – కళ్ల ముందే నిండు ప్రాణం బలి, ఏమైందంటే

ఇది రాజుల కాలం నుండి వస్తున్న ఆనవాయితీ. దసరా రోజు గుర్రపు స్వారీ పారువేట కొనసాగుతుంది. ఈ ఆటలో గెలవాలనే ఉద్దేశంతో మద్దికెరకు చెందిన పృధ్వీరాజ్‌ గుర్రపు స్వారీ చేయటంలో శిక్షణ తీసుకుంటుండగా, దురదృష్టవశాత్తు కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా గుర్రపు స్వారీలో జాగ్రత్తలు పాటించాలని నగరి వంశస్తులకు సూచిస్తున్నారు.

ప్రాణం మీదకు తెచ్చిన గుర్రపు స్వారీ సంప్రదాయం -  కళ్ల ముందే నిండు ప్రాణం బలి, ఏమైందంటే
Man Riding Horse
J Y Nagi Reddy
| Edited By: TV9 Telugu|

Updated on: Sep 06, 2024 | 6:18 PM

Share

గుర్రపు స్వారీ ఓ యువకుడి ప్రాణం బలితీసుకుంది. గుర్రపు స్వారీ చేస్తూ కింద పడిన అతడు మృత్యువాతపడ్డాడు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా మద్దికేరలో చోటుచేసుకుంది. దసరా ఉత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగే గుర్రాల పారువేటలో పాల్గొని విజేతగా నిలవాలనే కోరికతో గుర్రపు స్వారీ చేస్తున్న వ్యక్తి ప్రమాదవశత్తు గుర్రపై నుండి కింద పడిపోయాడు. అలా కిందపడిన వెంటనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

కర్నూలు జిల్లా మద్దికేరకు చెందిన పృథ్వీరాజ్ రాయుడు అనే యువకుడు బీఎన్ పేట నుంచి గుర్రంపై వస్తున్నాడు. అలా వస్తున్న సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పి కిందపడ్డాడు. దీంతో పృధ్వీరాజ్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పృథ్వీరాజ్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం తర్వాత బంధువులకు అప్పగించనున్నారు.

రాజుల కాలం నుండి మద్దికేరలో చిన్న నగరి,పెద్ద నగరి వంశస్థుల మధ్య గుర్రపు స్వారీ ఆట మొదలవుతుంది. ఈ ఆట బొజ్జనాయన పేట నుండి మద్దికేర వరకు ప్రతి సంవత్సరం దసరా పండుగ రోజు గుర్రాల పారవేట జరుగుతుంది. ఎవరైతే గుర్రం మీద బయల్దేరి భోజనానిపేట గ్రామం మీదుగా మద్దికేర గ్రామంలోకి ముందుగా వస్తారో వారే విజేతగా నిలుస్తారు . ఈ గుర్రపు స్వారీ లో విజయం వరించిన వారిని గ్రామంలో ఊరేగింపుగా చేస్తారు. ఇది రాజుల కాలం నుండి వస్తున్న ఆనవాయితీ. దసరా రోజు గుర్రపు స్వారీ పారువేట కొనసాగుతుంది. ఈ ఆటలో గెలవాలనే ఉద్దేశంతో మద్దికెరకు చెందిన పృధ్వీరాజ్‌ గుర్రపు స్వారీ చేయటంలో శిక్షణ తీసుకుంటుండగా, దురదృష్టవశాత్తు కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా గుర్రపు స్వారీలో జాగ్రత్తలు పాటించాలని నగరి వంశస్తులకు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు