Andhra Pradesh Politics: ఆసక్తి రేపుతున్న మంత్రాలయం రాజకీయాలు.. వైసీపీ నెక్ట్స్ ఎమ్మెల్యేగా అతనేనా?..

Andhra Pradesh Politics: కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున రానున్న ఎన్నికలలో పోటీ చేసేది..

Andhra Pradesh Politics: ఆసక్తి రేపుతున్న మంత్రాలయం రాజకీయాలు.. వైసీపీ నెక్ట్స్ ఎమ్మెల్యేగా అతనేనా?..
Follow us

|

Updated on: Jan 19, 2022 | 7:57 AM

Andhra Pradesh Politics: కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున రానున్న ఎన్నికలలో పోటీ చేసేది ఎవరు అనేదానిపై ఇప్పుడు జిల్లా రాజకీయాలలో హాట్ టాపిక్ నడుస్తోంది. ప్రస్తుతం మంత్రాలయం ఎమ్మెల్యే గా బాల నాగిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే ఆయన మూడవసారి ఎమ్మెల్యే. మరోసారి బాలనాగిరెడ్డి పోటీ చేసేందుకు సుముఖంగా లేరు అని ఆయన కుటుంబం నుంచే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక పెద్ద సెంటిమెంట్ ఉన్నట్లు కుటుంబీకులు చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలలో ఎక్కడా లేని విధంగా నలుగురు సోదరులు ప్రస్తుతం చట్టసభలలో ఉంటున్నారు.. వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామానికి చెందిన భీమిరెడ్డి మాజీ ఎమ్మెల్యే. భీమిరెడ్డి కి ఐదుగురు కుమారులు. ఇందులో నలుగురు కుమారులు ప్రస్తుతం చట్టసభలలో ఉండటం తెలుగు రాష్ట్రాలలోనే రికార్డ్ గా చెప్పుకుంటున్నారు.

బాల నాగిరెడ్డి మంత్రాలయం నుంచి, ఆదోని నుంచి సాయిప్రసాద్రెడ్డి, గుంతకల్ నుంచి వెంకట్ రామ్ రెడ్డి గత ఎన్నికలలో భారీ మెజారిటీతో ఎమ్మెల్యేలుగా గెలిచారు. మరో సోదరుడు మాజీ ఎమ్మెల్యే శివరాం రెడ్డికి ఇటీవలే ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి అవకాశం కల్పించారు. దీంతో ఒకే ఇంట్లో నలుగురు సోదరులు ఒకేసారి చట్టసభలలో కొనసాగుతూ ఉండటం తెలుగు రాష్ట్ర రాజకీయాలలో రికార్డ్ అని చెప్పుకోవాలి. మరో సోదరుడు సీతారామిరెడ్డి కూడా రాజకీయాలలో ఉన్నారు. మాజీ ఎంపీపీగా పని చేశారు. ఆయనను కూడా ఎమ్మెల్యే లేదా ఎంపీగా చూడాలనేది బాలనాగిరెడ్డి తల్లి, భీమిరెడ్డి సతీమణి కోరిక. ప్రస్తుతం ఆమె ఇంకా బతికే ఉన్నారు. దీంతో తల్లి కోరిక తీర్చేందుకు ఐదుగురు కొడుకులు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు. అదెలాగంటే.. సీతారామిరెడ్డి కొడుకు ప్రదీప్ రెడ్డి మంత్రాలయం నియోజవర్గంలో ఆక్టివ్ గా తిరుగుతున్నాడు. మొత్తం నియోజకవర్గ బాధ్యతలు అన్నీ అతనే చూస్తున్నాడు. బాల నాగిరెడ్డి అధికారిక సమీక్షలు ఇతరత్ర సమావేశాలు తప్ప రాజకీయాలు మొత్తం ప్రదీప్ రెడ్డి చూస్తున్నాడు. బాల నాగిరెడ్డి పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా లేరు. పైగా తల్లి కోరికలు తీర్చాలి కాబట్టి సీతారామిరెడ్డి కొడుకు ప్రదీప్ రెడ్డి ని మంత్రాలయం నుంచి పోటీ చేయించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఐదుగురు కొడుకులను ఎమ్మెల్యేలుగా చూడాలని కోరుకుంటున్న తల్లి కోరికలు తీర్చవచ్చు అనేది ఐదుగురు సోదరుల అభిప్రాయంగా ఉంది.

సీతారామిరెడ్డి ఎమ్మెల్యేగా కాలేకపోయినప్పటికీ ఆయన కొడుకు ప్రదీప్ రెడ్డి ని ఎమ్మెల్యేగా చేయాలని తాపత్రయ పడుతున్నారు. ఇందులో భాగంగానే మంత్రాలయం నియోజకవర్గం మొత్తం ప్రదీప్ రెడ్డి చుట్టేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇందుకు అంగీకరిస్తారా లేదా అనేది, మాజీ ఎమ్మెల్యే భీమిరెడ్డి భార్య కోరిక నెరవేరుతుందా లేదా అనేది ఇప్పుడు కర్నూలు జిల్లా రాజకీయాలలో హాట్ టాపిక్ నడుస్తోంది. అయితే దీనిపై ఇంకా బాలనాగిరెడ్డి కుటుంబీకులు ఒక స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది.

నాగిరెడ్డి, టీవీ9 రిపోర్టర్, కర్నూలు

Also read:

Dhanush Aishwaryaa: ధనుష్, ఐశ్వర్య విడిపోవడానికి కారణం అదేనా.. ఫలించని రజినీకాంత్ ప్రయత్నం..

Khammam: విషాదం.. చిన్నారులు ఆడుకుంటుండగా కూలిన భారీ వృక్షం.. ఇద్దరు మృతి

Krithi Shetty: ఆ స్టార్ హీరో రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించుకున్న కృతి శెట్టి.. అతను ఎవరంటే..

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు