AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kakinada: కోవిడ్ ఆసుపత్రిపై జగన్ సర్కార్ కొరడా.. ఎన్నడూ లేని విధంగా దిమ్మతిరిగే ఫైన్

Covid-19 Hospital: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో

Kakinada: కోవిడ్ ఆసుపత్రిపై జగన్ సర్కార్ కొరడా.. ఎన్నడూ లేని విధంగా దిమ్మతిరిగే ఫైన్
Kakinada Covid 19 Hospital
Shaik Madar Saheb
|

Updated on: Jun 12, 2021 | 6:48 AM

Share

Covid-19 Hospital: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ.. చాలా కార్పొరేట్ ఆసుపత్రులు పెడచెవిన పెడుతున్నాయి. వైద్యం పేరుతో రూ.లక్షలు దోచుకుంటున్నాయి. చివరికి బిల్లు కడితేనే రోగి శవాన్ని ఇస్తున్నాయి. అలా లక్షలకు లక్షలు వసూలు చేసినా.. ఓ ప్రైవేటు ఆసుపత్రిపై ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ సర్కార్ కొరడా ఝుళిపించింది. క్రిమినల్ కేసు నమోదు చేసి ఇప్పటివరకూ విధించనటువంటి భారీ ఫైన్ విధించింది.

తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఓబిలిశెట్టి సత్యనారాయణకు కరోనా సోకగా.. అతన్ని మే 14 న.. సాయిసుధా ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ఆయన చికిత్స పొందుతూ మరణించాడు. అనంతరం సాయి సుధా ఆసుపత్రి కోవిడ్ చికిత్సకు రూ.14 లక్షలు వసూలు చేసిందని బాధితుల కుటుంబసభ్యులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. ఆసుపత్రి యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేసినట్లు.. తేలడంతో జిల్లా అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఆసుపత్రి యాజమాన్యంపై కాకినాడ త్రీటౌన్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆరోగ్య శ్రీ జిల్లా క్రమశిక్షణా కమిటీ చేకూరి కీర్తి సమక్షంలో విచారణ జరిపి ఈ భారీ జరిమానా విధించారు.

బాధితుల దగ్గరి నుంచి రూ.3.16 లక్షలే తీసుకోవాల్సి ఉండగా.. ఆసుపత్రి యాజమాన్యం మొత్తం రూ.10.84 లక్షలను వసూలు చేసినట్లు నిర్ధారించారు. దీనికి ఏడు రెట్లు రూ.75.780 లక్షల జరిమానా విధించారు. దీంతో ఆసుపత్రి యాజమాన్యం ఈ నగదుకు సంబంధించిన చెక్కును కలెక్టర్ డీ. మురళీధర్ రెడ్డికి అందించింది. దీంతోపాటు బాధితుల నుంచి వసూలు చేసిన రూ.10.84 లక్షలను కూడా బాధితులకు అందించారు.

Also read:

మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. అమలులోకి వచ్చిన మద్యం డోర్ డెలివరీ స్కీమ్…

TV9 Alert: ఆనందయ్య మందుకు డూప్లికేట్..ఆయన శిష్యులం అంటూ దోచేస్తున్న కేటుగాళ్ళు..టీవీ9 పరిశీలనలో విస్తుపోయే నిజాలు!

Follow Us
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి