AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేలానికి మాజీ మంత్రి గంటా ఆస్తులు..

మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు చుట్టూ రుణఎగవేత ఉచ్చు బిగుసుకుంటోంది. ఇప్పటికే ఆయన ఆస్తులను సీజ్‌ చేసిన ఇండియన్ బ్యాంకు.. ముఖ్యమైనవాటిని వేలం వేసేందుకు సిద్ధమైంది. ఈమేరకు ఆన్‌లైన్‌ ద్వారా వేలం..

వేలానికి మాజీ మంత్రి గంటా ఆస్తులు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 11, 2020 | 12:54 PM

Share

మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు చుట్టూ రుణఎగవేత ఉచ్చు బిగుసుకుంటోంది. ఇప్పటికే ఆయన ఆస్తులను సీజ్‌ చేసిన ఇండియన్ బ్యాంకు.. ముఖ్యమైనవాటిని వేలం వేసేందుకు సిద్ధమైంది. ఈమేరకు ఆన్‌లైన్‌ ద్వారా వేలం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. ఇండియన్ బ్యాంకు నుంచి గంటా శ్రీనివాసరావుకు సంబంధించిన ప్రత్యూష కంపెనీ.. రూ.141కోట్ల 68లక్షలా 7వేల 500కు పైగా రుణం తీసుకుంది. ఇప్పుడు అసలు వడ్డీ కలిపి రూ.220 కోట్లా 66లక్షలా 90వేలకు పైగా బ్యాంకుకు కట్టాల్సి ఉంది. అయితే ఇంత మొత్తాన్ని గంటా ఎగవేసినట్లు ప్రకటించింది ఇండియన్ బ్యాంకు. దీంతో.. ఆయన ఆస్తులను వేలం వేయనున్నట్లు ఇండియన్ బ్యాంకు పేర్కొంది. కాగా మార్చి 16న ఈ ఆస్తులను వేలం వేయనున్నట్లు బ్యాంకు తెలిపింది. అయితే ఈ ఆస్తుల వేలంపై గంటా కుటుంబం ఎలా స్పందించనుందో చూడాలి.

Read More: ఒంటరైన మారుతీరావు భార్య.. నేరం ఎవరిది? శిక్ష ఎవరికి!

శ్మశాన వాటికలో ఉద్రిక్త పరిస్థితులు.. కడసారి చూపుకు నోచుకోని అమృత 

అమృత, ప్రణయ్‌ల లవ్‌స్టోరిపై సినిమా.. హీరో ఎవరంటే?

పొలిటికల్ పార్టీలకు రూ.2,512 కోట్ల విరాళాలు.. ఇచ్చిందెవరో తెలీదు!

నీకు సిగ్గుందా.. అంటూ అమృతపై శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్