AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లి ఒడిలో సేదతీరాల్సిన చిన్నారి.. తండ్రి ఘాతుకానికి రోదన.. ఏం జరిగిందంటే..

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారి ప్రేమకు, దాంపత్యానికి సాక్షిగా ముద్దుల చిన్నారి కూడా ఉంది. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు అంతలోనే కుటుంబ కలహాలు మొదలయ్యాయి. పెద్దల పంచాయతీలు, పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్‎లు కూడా జరిగాయి. అంతా బాగానే ఉంది. ఇద్దరు హాయిగా ఉంటున్నారు అనుకుంటున్న సమయంలో అనుకోని దారుణం జరిగిపోయింది.

తల్లి ఒడిలో సేదతీరాల్సిన చిన్నారి.. తండ్రి ఘాతుకానికి రోదన.. ఏం జరిగిందంటే..
Anantapuram
Nalluri Naresh
| Edited By: |

Updated on: Jul 16, 2024 | 9:07 PM

Share

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారి ప్రేమకు, దాంపత్యానికి సాక్షిగా ముద్దుల చిన్నారి కూడా ఉంది. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు అంతలోనే కుటుంబ కలహాలు మొదలయ్యాయి. పెద్దల పంచాయతీలు, పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్‎లు కూడా జరిగాయి. అంతా బాగానే ఉంది. ఇద్దరు హాయిగా ఉంటున్నారు అనుకుంటున్న సమయంలో అనుకోని దారుణం జరిగిపోయింది. కట్టుకున్న వాడే కాలయముడై.. ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్యను అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడు. అనంతపురం జిల్లా పాత గుంతకల్లులో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. గుత్తి పట్టణానికి చెందిన పులికొండ (భర్త) గుంతకల్లుకు చెందిన సాయితేజ (భార్య) బంధువులు. సాయితేజను ఇష్టపడిన పులికొండ కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలం దాంపత్యం అన్యోన్యంగానే సాగింది. తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. పెద్ద మనుషులు పంచాయతీ చేశారు. పోలీస్ స్టేషన్లోనూ కౌన్సిలింగ్ ఇచ్చారు. తర్వాత అంతా బాగానే ఉంది.

పులికొండ, భార్య సాయి తేజ మధ్య మళ్ళీ ఏమైందో తెలియదు కానీ సెల్ ఫోన్ చార్జింగ్ వైర్‎తో గొంతు బిగించి అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడు భర్త పులికొండ. హత్య అనంతరం చిన్నారిని తీసుకొని పారిపోతుండగా.. పీర్ల చావిడి దగ్గర ఉన్న యువకులు భర్త పులికొండను గమనించారు. రక్తపు మరకలతో చిన్నారిని తీసుకెళ్తుండటంతో అనుమానం వచ్చి అడ్డుకున్నారు. చిన్నారిని వదిలేసి అక్కడి నుండి పులికొండ పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వెంటనే అక్కడికి చేరుకొని విచారించిన పోలీసులకు దారుణ విషయం బయటపడింది. పులికొండ ఇంటిలోకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో ఉన్న సాయి తేజను పోలీసులు గుర్తించారు. హుటాహుటిన సాయి తేజను గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డబ్బు కోసమే తన కూతుర్ని చంపేశాడని సాయి తేజ తల్లిదండ్రులు ఆరోపించారు. తల్లి చనిపోవడం.. తండ్రి కటకటాల పాలవుతుండడంతో పాలు తాగే పసిపాప ఒంటరిగా మిగిలిపోయింది. తల్లి ఒడిలో ఉండాల్సిన చిన్నారిని ఎత్తుకొని కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు అందరినీ కలచివేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!