AP Elections 2024: రాయలసీమలో పెరిగిన పోలింగ్ శాతం.. అనుకూల, ప్రతికూలతలపై జోరుగా చర్చ..

రాయలసీమలో ఓటింగ్‌ శాతం భారీగా పెరిగింది. గతంలో కంటే అధిక శాతం నమోదైంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. మండుటెండను సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు ఓటర్లు. ముఖ్యంగా మహిళలు పోలింగ్ కేంద్రాలకు బారులుదీరారు. యువత కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎక్కువ ఉత్సాహం చూపించింది.

AP Elections 2024: రాయలసీమలో పెరిగిన పోలింగ్ శాతం.. అనుకూల, ప్రతికూలతలపై జోరుగా చర్చ..
Rayalaseema
Follow us

|

Updated on: May 14, 2024 | 12:04 PM

రాయలసీమలో ఓటింగ్‌ శాతం భారీగా పెరిగింది. గతంలో కంటే అధిక శాతం నమోదైంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. మండుటెండను సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు ఓటర్లు. ముఖ్యంగా మహిళలు పోలింగ్ కేంద్రాలకు బారులుదీరారు. యువత కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎక్కువ ఉత్సాహం చూపించింది. ఇక సీఎం జగన్ సొంత జిల్లా కడపలో గతంలో కంటే ఎక్కువగా పోలింగ్ నమోదైంది. అదే విధంగా కర్నూలు జిల్లాలోనూ పొలింగ్ శాతం అత్యధికంగా నమోదైనట్లు గత పోలింగ్ గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది. నంద్యాలలో గతంలో మాదిరిగానే పోలింగ్ శాతం నమోదైంది. ఇదిలా ఉంటే అనంతపురం, హిందూపురం, తిరుపతి, చిత్తూరులో పోలింగ్ శాతం గతం కన్నా కాస్త తగ్గిందని చెబుతున్నారు అధికారులు.

ఇక నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఓటర్లు భారీ సంఖ్యలో పోటెత్తారు. గతం కన్నా ఒకశాతం ఎక్కువే పోలింగ్ నమోదైంది. రాయలసీమలోని అన్ని జిల్లాలతో పోలిస్తే అత్యధికంగా సత్యసాయి జిల్లాలో 82.77శాతం నమోదు అయింది. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 75.83 శాతం నమోదు అయినట్లు నిన్న ఈసీ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. అదే కడప జిల్లాలో 78.72శాతం, నంద్యాల 80.92, అనంతపురం 79.25, తిరుపతి 76.5, చిత్తూరు 82.65శాతం నమోదు అయ్యాయి. మొత్తం రాయలసీమను ఓవర్ ఆల్‎గా పరిశీలిస్తే.. 79.53గా నమోదైంది. ఇది సాయంత్రం 6 గంటల వరకు నమోదైన పోలింగ్ మాత్రమే. ఇక అర్థ రాత్రి వరకు కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ ఓటింగ్ శాతంపై ఈసీ ఒక అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. దానిని కూడా కలిపితే దాదాపు 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు అంచనా వేస్తున్నారు. ఈ పెరిగిన పోలింగ్ అధికార పార్టీ వైసీపీకి అనుకూలించే అంశంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు కొందరు నేతలు. గతంలో లాగానే ఈసారి కూడా మహిళలు అధికశాతం ఓటింగ్‎లో పాల్గొనడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రభావం బాగా ఫలించిందని భావిస్తున్నారు. దీనిపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే పోటీ చేసిన అభ్యర్థుల్లో మాత్రం తీవ్ర ఉత్కంట నెలకొంది. తుది ఫలితాలు వెల్లడి కావాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!