Andhra Pradesh: పక్కనే బాలుడు ఉన్నా కనికరించలేదు.. గురజాల అత్యాచార నిందితులు అరెస్టు

మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా కొందరు మాత్రం భయం లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. నిత్యం ఎక్కడో ఒకచోట మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు సభ్య సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా...

Andhra Pradesh: పక్కనే బాలుడు ఉన్నా కనికరించలేదు.. గురజాల అత్యాచార నిందితులు అరెస్టు
Chittoor man Arrested
Follow us

|

Updated on: May 02, 2022 | 9:55 PM

మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా కొందరు మాత్రం భయం లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. నిత్యం ఎక్కడో ఒకచోట మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు సభ్య సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై దాడులు, నేరాలు, అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత నెలలో గురజాల(Gurajala) రైల్వే స్టేషన్ లో జరిగిన అత్యాచార ఘటనను మరవక ముందే రేపల్లె(Repalle) రైల్వే స్టేషన్ లోనూ ఓ మహిళపై అత్యాచారం జరిగింది. అయితే.. ఏప్రిల్ లో గురజాల రైల్వే స్టేషన్‌లో మహిళపై జరిగిన అత్యాచారం కేసును పోలీసులు ఛేదించారు. ఏప్రిల్ 16న రైల్వే స్టేషన్‌లో మహిళపై అత్యాచారం జరిగింది. రాత్రి సమయం కావడంతో ఈ ఘటనను ఎవరూ గుర్తించలేదు. ఉదయం అటు వైపు వెళ్లిన కొందరు మహిళను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టిన రైల్వే పోలీసులు.. గత నెల 21న గురజాలకు చెందిన ప్రసాద్‌ను అరెస్టు చేశారు.

ఈ కేసులో ఏ1 నిందితుడు కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన సుబ్బారావును సోమవారం అరెస్టు చేశారు. మరొక గ్రామానికి వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌లో వేచి ఉన్న మహిళను కొందరు దుండగులు సమీప ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమె ఎక్కడి నుంచి వస్తోంది.. ఎక్కడికి వెళ్తోంది.. అనే విషయం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు. ఆమెతో పాటు 3 సంవత్సరాల బాలుడు కూడా అక్కడే ఉన్నాడు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Amazon Summer Sale: అమెజాన్‌లో సమ్మర్‌ సేల్‌.. స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర ప్రొడక్ట్స్‌పై భారీ ఆఫర్లు.. ఎప్పటి నుంచి అంటే..!

Viral Video: కిచెన్‌లో వింత శబ్దాలు.. వెళ్లి చూడగా ఒక్కసారిగా భయంతో గుండె గుభేల్!