AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: రైస్ మిల్లులో పోలీసుల తనిఖీలు.. చూసి షాక్ అయిన అధికారులు..

ఎన్నికల వేళ భారీగా గోవా మద్య పట్టుబడింది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం తిప్పనగుంట గ్రామంలో అక్రమంగా తరలించి నిలువ ఉంచిన మద్యాన్ని గుర్తించారు పోలీసులు. ఏపీలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఈసీ. ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి అణువణువునా గాలింపు చర్యలు చేపట్టింది. జిల్లా చెక్ పోస్టుల నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ప్రతి అంశంపై ప్రత్యేక నిఘా పెట్టారు.

Watch Video: రైస్ మిల్లులో పోలీసుల తనిఖీలు.. చూసి షాక్ అయిన అధికారులు..
Goa Liquor
Srikar T
|

Updated on: May 10, 2024 | 10:39 AM

Share

ఎన్నికల వేళ భారీగా గోవా మద్య పట్టుబడింది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం తిప్పనగుంట గ్రామంలో అక్రమంగా తరలించి నిలువ ఉంచిన మద్యాన్ని గుర్తించారు పోలీసులు. ఏపీలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఈసీ. ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి అణువణువునా గాలింపు చర్యలు చేపట్టింది. జిల్లా చెక్ పోస్టుల నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ప్రతి అంశంపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా బాపులపాడు మండలం తిప్పనగుంట గ్రామంలోని రైస్ మిల్లులో పెద్ద ఎత్తున గోవా మద్యాన్ని నిలువ ఉంచినట్లు గుర్తించారు. స్థానికుల సహాయంతో విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే రైస్ మిల్లు వద్దకు చేరుకుని తనిఖీలు నిర్వహించారు.

రైస్ మిల్లు గోడౌన్ తెరిచి చూసిన పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా షాక్‎కు గురయ్యారు. తిప్పనగుంట రైస్ మిల్లులో 125 కేసుల గోవా మద్యం సీజ్ చేశారు. అందులో ఫుల్ బాటిళ్లతో పాటు క్వార్టర్ బాటిల్స్ కేసులు కూడా ఉన్నాయి. పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం విలువ సుమారు రూ. 7 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ మద్యం సీసాలను వీరవల్లి పోలీస్ స్టేషన్‎కు తరలించారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వీటిని రైస్ మిల్లులో భద్రపరచడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయ్నతం చేస్తున్నారు. రైసు మిల్లు యాజమాని ప్రస్తుతం అందుబాటులో లేరు. ఆయనను గుర్తించి విచారించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఈ బాటిళ్లను ఈ గోడౌన్ లో నిలువ ఉంచారు, ఆ మద్యం సీసా కేసులు ఎవరికి సంబంధించినవి అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ ఆపరేషన్‎లో పోలీసులతో పాటు ఎన్నికల అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు..
ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు..
ఫిబ్రవరి 29న మొదలైన ‘గమ్యం’ మ్యాజిక్‌కు 18 ఏళ్లు
ఫిబ్రవరి 29న మొదలైన ‘గమ్యం’ మ్యాజిక్‌కు 18 ఏళ్లు
ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే..
ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే..
వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!
తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?