Earthquake: నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భూ ప్రకంపనలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
Andhra Padesh: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, నెల్లూరు జిల్లాలో శనివారం మధ్యాహ్నం భూప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు.
Andhra Padesh: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, నెల్లూరు జిల్లాలో శనివారం మధ్యాహ్నం భూప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. దుత్తలూరు, ఉదయగరి, దుత్తలూరు, కొండాపురం,వింజమూరు, వరికుంటపాడు తదితర గ్రామాల్లో 2 సెకన్ల పాటు భూమి కంపించగా.. నెల్లూరు జిల్లాలోని పామూరు మండలంలో సుమారు 3 సెకన్ల పాటు భూమి కంపించింది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.