Azadi Ka Amrit Mahotsav: ప్రోటోకాల్ పేరుతో జాతీయ జెండాను అగౌరవం.. నేతల తీరుపై జనం ఫైర్.. ఎక్కడంటే..

Azadi Ka Amrit Mahotsav: తిరంగా ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. తిరంగా ర్యాలీ ఆకట్టుకుంది. వాడవాడలా ఘనంగా తిరంగా యాత్ర.. దేశవ్యాప్తంగా భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో పార్టీలకు అతీతంగా ఇప్పుడు..

Azadi Ka Amrit Mahotsav: ప్రోటోకాల్ పేరుతో జాతీయ జెండాను అగౌరవం.. నేతల తీరుపై జనం ఫైర్.. ఎక్కడంటే..
Indian Flag
Follow us

|

Updated on: Aug 12, 2022 | 6:37 PM

నింగి, నేల, నీరు.. ఎటు చూసినా మువ్వన్నెల రెపరెపలే. స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లవుతున్న సందర్భంగా.. దేశవ్యాప్తగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఊరు..వాడలా తిరంగా ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. తిరంగా ర్యాలీ ఆకట్టుకుంది. వాడవాడలా ఘనంగా తిరంగా యాత్ర.. దేశవ్యాప్తంగా భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఇదే నినాదం వినిస్తోంది. ఊరు, వాడాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పంద్రాగస్టులోపు ప్రతి ఇంటిపై జాతీయజెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు నేతలు.

ఇదంతా ఇలా ఉంటే.. ఒకటి రెండు చోట్ల మాత్రం తప్పులు దొర్లుతున్నాయి. రాజమండ్రిలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఆజాదిక అమృత్ మహోత్సవాల్లో భాగంగా జాతీయ జెండా కింద నుంచి వెళ్లిపోయారు అధికారులు. ప్రజా ప్రతినిధుల కాన్వాయ్ వాహనాలు.. జాతీయ జెండాను ప్రదర్శిస్తున్న రాజమండ్రి వై జంక్షన్ ప్రాంతం నుంచి.. కనీసం మాకు పట్టనట్టు జెండా పైకి లేపి మరి కింద నుంచి వెళ్లిపోయారు ప్రజాప్రతినిధుల, అధికారులు వాహనాలు. గంటల తరబడి జెండాను పట్టుకుని ర్యాలీగా వెళ్లిన విద్యార్థులు స్థానిక ఉద్యోగులు. జాతీయ జెండాకి గౌరవం ఇవ్వకుండా జిల్లా కలెక్టర్ వాహనం కూడా నిర్లక్ష్యంగా వెళ్లిపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు.

ఆ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని అంధ్రప్రదేశ్ వార్తల కోసం