AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: నో వర్రీ.. స్కూల్‌ బస్సులను ఉపయోగించుకోండి.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు సంక్రాంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. దానికి సంబంధించిన అప్డేట్స్ ఆదివారం విడుదల చేయబోతున్నారు. ఇక సంక్రాంతికి సొంతూళ్లకు వచ్చే వాళ్ల కోసం అధికారులకు కీలక సూచనలు చేశారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని స్కూల్ బస్సులను కూడా ఉపయోగించుకోవాలని సూచించారు.

Chandrababu: నో వర్రీ.. స్కూల్‌ బస్సులను ఉపయోగించుకోండి.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
CM Chandrababu
Shaik Madar Saheb
|

Updated on: Jan 11, 2025 | 6:49 PM

Share

ఏపీ అభివృద్ధి కోసం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు సంక్రాంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. దానికి సంబంధించిన అప్డేట్స్ ఆదివారం విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో శనివారం మీడియాతో చిట్ చాట్ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. P4 కాన్సెప్ట్ పేపర్‌ను ఆదివారం విడుదల చేస్తామని తెలిపారు. అన్ని స్థాయిల్లో చర్చలు జరిగాక.. సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని P4 విధానాన్ని అమల్లోకి తెస్తామన్నారు. అంతే కాకుండా ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ ప్యానెల్స్ అందిస్తామన్నారు. పెట్టుబడి తిరిగి వచ్చే వరకు కొంత విద్యుత్‌‌ను ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ తర్వాత ఇంటి యజమానికి యూనిట్‌ను అప్పగిస్తామన్నారు.

ఇక తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పండగ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఊరు వెళ్లి నలుగురితో కలవటం అలవాటు చేసుకోవాలి. తాను కూడా అందుకే ప్రతి ఏటా సంక్రాంతికి సొంతూరుకు వెళ్తున్నట్టు చెప్పారు. తన సతీమణి కోరిక మేరకు పాతికేళ్ల నుంచి సొంతూరు వెళ్తున్నట్టు సీఎం చంద్రబాబు చెప్పారు.

సొంతూళ్లకు వచ్చే వాళ్లకు ప్రయాణాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆర్టీసీని సీఎం ఆదేశించారు. ప్రయాణికులను ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు పంపేందుకు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బస్సులు తీసుకోవాలన్నారు. ఫిట్‌నెస్‌ ఉన్న బస్సులను ఎంపిక చేసి వాటి ద్వారా ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు పంపే ఏర్పాట్లు చేయాలన్నారు. రద్దీ తీవ్రంగా ఉన్న మార్గాల్లో ఈ తరహా ఏర్పాట్లతో ప్రజలకు కొంత మేర ఇబ్బందుల్లేకుండా ఉంటుందని సీఎం చంద్రబాబు అధికారులతో పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మాంసాహారులు చైత్ర నవరాత్రి ఉపవాసం పాటించవచ్చా? శాస్త్రాలు..
మాంసాహారులు చైత్ర నవరాత్రి ఉపవాసం పాటించవచ్చా? శాస్త్రాలు..
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!
మసాలా ఫుడ్ తెగ లాగించేస్తున్నారా?.. తెల్లారి ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప
మసాలా ఫుడ్ తెగ లాగించేస్తున్నారా?.. తెల్లారి ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప
వామ్మో.. ఈ 3 పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టి తింటే ఇంత డేంజరా?..
వామ్మో.. ఈ 3 పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టి తింటే ఇంత డేంజరా?..
ఆ స్టార్ హీరోని కౌగిలించుకోగానే తెగ సిగ్గు పడ్డాడు..
ఆ స్టార్ హీరోని కౌగిలించుకోగానే తెగ సిగ్గు పడ్డాడు..
ఏసీ లేకపోయినా టెన్షన్ లేదు! ఈ మొక్కలతో మీ ఇల్లు కూల్‌గా మారుతుంది
ఏసీ లేకపోయినా టెన్షన్ లేదు! ఈ మొక్కలతో మీ ఇల్లు కూల్‌గా మారుతుంది
ఏనుగుకి కనిపించే రెండు దంతాలేనా.. నోట్లో ఇంకా పళ్లు ఉంటాయా?
ఏనుగుకి కనిపించే రెండు దంతాలేనా.. నోట్లో ఇంకా పళ్లు ఉంటాయా?
దేశ రక్షణ కోసం భుజం భుజం కలిపి నిలబడాలిః రాజ్‌నాథ్
దేశ రక్షణ కోసం భుజం భుజం కలిపి నిలబడాలిః రాజ్‌నాథ్
"పేదవారితో ఇళ్లు వేయించి కబ్జా చేస్తున్న వారిని పట్టుకోరా?:"