AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP MP GVL: వైసీపీ ప్రభుత్వం నిధుల దుర్వినియోగానికి పాల్పడుతోంది.. బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు

BJP MP GVL: త్రిసభ్య కమిటీలో వివాదాస్పద అంశాల కంటే తెలంగాణా(Telangana)కు సంబంధించిన అంశాలు ఉండటమే మేలన్న ఉద్దేశ్యంతో ప్రత్యేక హోదా అంశాన్ని హోంశాఖ తొలగించిందని టీవీ 9తో బీజేపీ రాజ్యసభ సభ్యుడు..

BJP MP GVL: వైసీపీ ప్రభుత్వం నిధుల దుర్వినియోగానికి పాల్పడుతోంది.. బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు
Bjp Mp Gvl Narasimha Rao
Surya Kala
|

Updated on: Feb 15, 2022 | 6:39 PM

Share

BJP MP GVL: త్రిసభ్య కమిటీలో వివాదాస్పద అంశాల కంటే తెలంగాణా(Telangana)కు సంబంధించిన అంశాలు ఉండటమే మేలన్న ఉద్దేశ్యంతో ప్రత్యేక హోదా అంశాన్ని హోంశాఖ తొలగించిందని టీవీ 9తో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు చెప్పారు. అంతేకాదు ఈ సందర్భంగా జీవీఎల్‌ నరసింహారావు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలను తెలుగు ప్రజలతో పంచుకున్నారు. తాను కూడా త్రిసభ్య కమిటీలో వివాదాస్పద అంశాలను తొలగించాలని సూచించినట్లు తెలిపారు.. అయితే ఇలా తొలగించిన ఆంశాలను ప్రత్యేకంగా, విడిగా చర్చించాలని కోరానని తెలిపారు. ఇప్పుడు  తాను కోరిన విధంగానే వైసిపి కూడా ఇదే పద్దతిలో కోరాలని సూచించారు. తెలంగాణ సీఎం కేసిఆర్‌ బిజెపిని టార్గెట్‌ చేసి మాట్లాడుతున్నారు. ఆయనకు బిజెపి అంటే భయం పట్టుకుంది..రానున్న ఎన్నికల్లో బిజెపి ఓడిస్తుందన్న భయంతో కేంద్రాన్ని, ప్రధాని మోడీని కేసిఆర్‌ టార్గెట్‌ చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు ఏపీలో బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుందని, తెలంగాణా తరహా పరిణామాలు ఇక్కడ కూడా పునరావృతమవుతున్నాయన్న భయంతో వైసిపి చవకబారు ప్రయత్నాలు చేస్తుందని తీవ్ర విమర్శలు చేశారు జీవీఎల్. ఏపీ లో వైసీపీ నుంచి 22 మంది ఎంపిలు గెలిచారు.. 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు… వీరు ఏం చేస్తున్నారో ఎవరికీ  తెలియదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ప్రజలను ఉద్దేశించి..బీజీపీ కి ఒక్క ఎంపి, ఎమ్మెల్యే సీటు ఇవ్వకుండా మమ్మల్ని పోరాటం చేయమంటే ఎలా అంటూ ప్రశ్నించారు. నిజానికి ఏపీకి ఆరేళ్ళలో మూడు రెట్ల నిధులను కేంద్రం ఇచ్చింది. 24 వేల కోట్ల నుంచి 77 వేల కోట్ల వరకు కేంద్రం నిధులు ఇస్తోంది.. గత ఏడాది ఏపీ నుంచి కేంద్రానికి  55 వేల కోట్ల రూపాయలు పన్నులు వెళితే..  కేంద్రం నుంచి 77 వేల కోట్లు వచ్చాయని లెక్కలు చెప్పారు. అయితే ఏపీ  ప్రభుత్వం చేతకాని ప్రభుత్వమని.. అందుకనే కేంద్రం ఇచ్చిన నిధులను సక్రమంగా వినియోగించుకోలేక, అభివృద్దిపై దృష్టి పెట్టక.. ఆ నిధులను దారి మళ్ళిస్తూ దుర్వినియోగం చేస్తోందంటూ ఏపీ సర్కార్ పై జీవీఎల్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీకి ఏపీ ప్రజలు అధికారం ఇస్తే నిధుల్ని సక్రమంగా వినియోగిస్తామని.. ప్రజల అభివృద్ధికి పాటుపడతామని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్‌ నరసింహారావు చెప్పారు.

Also Read:

రోజురోజుకీ తెలివి మీరుతోన్న స్మగ్లింగ్‌ రాయుళ్లు.. బంగారాన్ని అక్రమంగా ఎలా తరలించారో చూడండి..

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ