AP High Court: ఆంధ్రప్రదేశ్లో కరోనా రోగుల చికిత్సపై హైకోర్టులో విచారణ.. కీలక ఆదేశాలు జారీ
AP High Court: ఏపీలో కరోనా కాలరాస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా.. కేసుల సంఖ్య ఏ...
AP High Court: ఏపీలో కరోనా కాలరాస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా.. కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో కరోనా రోగులకు అందుతున్న చికిత్సపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సామాజిక కార్యకర్త తోట సురేష్, ఏపీ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ వేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిపారు. ఆస్పత్రుల్లో అందుతున్న చికిత్స, ఫీజుల వసూలు, ఇతర అంశాలపై వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్స్ను ఏర్పాటు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని సూచించింది.
ఆస్పత్రుల్లో కరోనా రోగులు, ఆస్పత్రుల్లో బెడ్ల వివరాలపై డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని, రెమ్డెసివిర్, అత్యవసర మందులపై రోజువారీ సమీక్ష ఉండాల్సిందేనని హైకోర్టు సూచించింది. అలాగే రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే ఆక్సిజన్ కొరతపై ప్రతిరోజు సమీక్ష నిర్వహించాలని కూడా తెలిపింది. రాష్ట్రంలో ఐసోలేషన్ కేంద్రాలను పెంచాలని, అలాగే పడకల సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకోవాలని పేర్కొంది.
ఇవీ చదవండి: