AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజధానిలో అభివృద్ధి పనులకు టెండర్లు.. ప్రపంచ బ్యాంక్‌, ఏడీబీ రుణంతో..

ఏపీ రాజధాని అమరావతిని అత్యున్నత ప్రమాణాలతో నిర్మించాలన్న లక్ష్యంతో దూసుకెళ్తోంది కూటమి ప్రభుత్వం. రాజధాని పనులను వేగవంతం చేస్తూ.. టెండర్లు పిలిచింది సీఆర్డీఏ. ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.? ఓసారి లుక్కేయండి ఈ ఆర్టికల్

రాజధానిలో అభివృద్ధి పనులకు టెండర్లు.. ప్రపంచ బ్యాంక్‌, ఏడీబీ రుణంతో..
Amaravati Development
Ravi Kiran
|

Updated on: Jan 10, 2025 | 9:50 PM

Share

అమరావతిలో నిలిచిన పనులను స్పీడ్‌ అప్ చేసింది కూటమి సర్కార్‌. గతంలో నిర్లక్ష్యానికి గురైన పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఈమేరకు రాజధాని అమరావతిలో 2వేల 816 కోట్లతో అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచింది సీఆర్‌డీఏ. రాజధానిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు టెండర్లు ఆహ్వానించింది. బిడ్ల దాఖలుకు ఈనెల 31న సాయంత్రం 4 గంటల వరకు గడువు ఇచ్చింది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు సాంకేతిక బిడ్లను తెరవనుంది సీఆర్డీఏ. పాలవాగు, గ్రావిటీ కాలువల పనులతో పాటు రాజధానిలోని వివిధ ప్రాంతాల్లోని రోడ్లకు సంబంధించిన పనులకు టెండర్లు పిలిచింది. అనంతవరం నుంచి ఉండవల్లి వరకూ కొండవీటి వాగును, దొండపాడు నుంచి కృష్ణాయపాలెం వరకూ పాలవాగును వెడల్పు, లోతు చేసే పని కోసం శాఖమూరులో 462.26 కోట్ల రూపాయలతో 0.03 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేయనున్నారు.

303.73 కోట్ల రూపాయలతో 7.83 కి.మీ. పొడవు కాలువ నిర్మాణం చేపట్టి.. 0.1 టీఎంసీ సామర్థ్యంతో కృష్ణాయపాలెం రిజర్వా‌యర్ పనులను చేపట్టనున్నారు. వీటితోపాటు 372.23 కోట్లతో E8 రోడ్డు, 419.96 కోట్ల రూపాయలతో E9, 241.67 కోట్లతో E14, 364.41 కోట్ల రూపాయలతో E3 రోడ్లు నిర్మించనున్నారు. అంతేకాదు 443.84 కోట్ల రూపాయలతో N12, 183.21 కోట్లతో N6 ఇలా వివిధ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం చేపట్టబోతున్నారు. రెయిన్ వాటర్ డైవర్షన్‌ కాలువలు, తాగునీటి సరఫరా పైపులైన్లు, డ్రెయినేజీలు, పార్కుల అభివృద్ధి, సైకిల్ ట్రాక్లు, విద్యుత్, కమ్యూనికేషన్ డక్ట్ నిర్మాణం కోసం సీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి