AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur: పైకి చూస్తే యాపిల్ పండ్ల లోడ్.. తీరా లోపల చెక్ చేయగా మైండ్ బ్లాంక్

గుంటూరులో అక్రమ మద్యం రవాణా కలకలం రేపింది. పైకి చూస్తే ఆ ట్రక్‌లో ఉన్నదంతా యాపిల్ పండ్లే.. కానీ తీరా పోలీసులు సాధారణ తనిఖీలు చేయగా.. అక్కడ కనిపించినవి చూసి దెబ్బకు షాక్ అయ్యారు. ఇంతకీ అదేంటంటే.. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

Guntur: పైకి చూస్తే యాపిల్ పండ్ల లోడ్.. తీరా లోపల చెక్ చేయగా మైండ్ బ్లాంక్
Apple Load
Ravi Kiran
|

Updated on: Jan 02, 2025 | 11:22 AM

Share

గుంటూరు జిల్లాలో అక్రమ మద్యం రవాణా తీవ్ర కలకలాన్ని రేపింది. యాపిల్ పండ్ల వ్యాపారం మాటున పక్క రాష్ర్టాల మద్యం తరలింపు వ్యవహారం గుట్టురట్టు అయింది. మినీ లారీలో యాపిల్ పండ్ల చాటున పక్క రాష్ర్టాల మద్యం అమ్ముతూ ముగ్గురు సభ్యుల ముఠా పోలీసులకు పట్టుబడ్డారు. మంగళగిరి మానస సరోవర్ వద్ద మాటు వేసి నిందితులను పట్టుకున్నారు. ప్రధాన నిందితులు పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం తుంగపాడు గ్రామానికి చెందిన బొడ్డపాటి బాలక్రిష్ణ, ముండ్రు మస్తాన్ రావు, అనపర్తి ఏసోబు అని గుర్తించారు స్పెషల్ ఎక్సైజ్ పోలీసులు. చండీగఢ్ ,పంజాబ్ రాష్ర్టాల నుంచి గతంలో అనేకసార్లు మినీ లారీలో తెచ్చి అమ్మినట్లు ఉన్నతాధికారుల విచారణలో ఒప్పుకున్నారు ముఠా కీలక సూత్రధారులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి