AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Cabinet : ఏపీలో వారందరికి అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక పాత విధానంలోనే పెన్షన్‌ల అమలు!

ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. తాజాగా జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట కల్పించే అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది. 2004 కంటే ముందు ఉద్యోగాల్లో చేరిన వారికి పాత పెన్షన్ విధానాన్నే (OPS) అమలు చేయాలని నిర్ణయించింది. తాజా ప్రభుత్వం నిర్ణయంతో సుమారు 11వేల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.

AP Cabinet : ఏపీలో వారందరికి అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక పాత విధానంలోనే పెన్షన్‌ల అమలు!
Andhra Pradesh Old Pension Scheme
Anand T
|

Updated on: Jun 23, 2026 | 4:40 PM

Share

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో 2004 కంటే ముందు ఉద్యోగాల్లో చేరిన వారికి పాత పెన్షన్ విధానాన్ని (OPS) అమలు చేయాలని నిర్ణయించింది. తాజాగా వెలగపూడి సచివాలయంలో మంత్రులతో జరిగిన కేబినెట్‌ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11 వేల ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. రిటైర్మెంట్ సమయంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగికి సగటున రూ.3 కోట్ల వరకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.

అలాగే రాష్ట్రంలో కొత్త పెట్టుబడుల స్థాపనకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమొదం తెలిపింది. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, ఐటీ, పర్యాటకం, రాజధాని అభివృద్ధి, డేటా సెంటర్లు ఏర్పాటు వంటి అనేక ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.SIPB ద్వారా ప్రతిపాదించిన మొత్తం రూ.34 వేల కోట్ల భారీ పెట్టుబడుల స్థాపననకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ భారీ ప్రాజెక్టుకు అందుబాటులోకి వస్తే సుమారు 35 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

క్యాబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా సాయికృష్ణ వ్యవహారంపై మంత్రులతో చర్చించారు. సాయికృష్ణ కేసులో ప్రభుత్వం చేయాల్సిన ప్రతి చర్య తీసుకుందని ముఖ్యమంత్రి వివరించారు. ఈ అంశంపై మంత్రులు అప్రమత్తంగా ఉండాలని, వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను అనవసరంగా ఈ వివాదంలోకి లాగుతున్నారన్న సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ప్రచారాన్ని మంత్రులంతా ఖండించాలని, కూటమి పార్టీలకు అతీతంగా అందరూ స్పందించాలని సూచించారు. సాయికృష్ణ వ్యవహారంలో ప్రభుత్వం ఇప్పటికే సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు జరుపుతోందని సీఎం అన్నారు. ప్రభుత్వం లక్ష్యం నిష్పక్షపాత దర్యాప్తు మాత్రమేనని, మంత్రులంతా ఇదే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గోధుమ పిండితో ఈజీగా చేసుకునే సూపర్ టేస్టీ వెజ్ ప్యాకెట్స్..
గోధుమ పిండితో ఈజీగా చేసుకునే సూపర్ టేస్టీ వెజ్ ప్యాకెట్స్..
100 గజాల స్థలంలో బేస్‌మెంట్ వరకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..?
100 గజాల స్థలంలో బేస్‌మెంట్ వరకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..?
బోనాల జాతరలో అమ్మవారి భవిష్యవాణి.. ఆచారాలను వీడితే అనర్థాలే అంటూ
బోనాల జాతరలో అమ్మవారి భవిష్యవాణి.. ఆచారాలను వీడితే అనర్థాలే అంటూ
ఫిట్‌గా ఉంటే పక్కన పెట్టొద్దు..సెలెక్టర్లకు జహీర్ ఖాన్ కీలక సూచన
ఫిట్‌గా ఉంటే పక్కన పెట్టొద్దు..సెలెక్టర్లకు జహీర్ ఖాన్ కీలక సూచన
ఈ రైళ్లో ప్రయాణించాలంటే ఆక్సిజన్‌ మాస్క్‌లు తప్పనిసరి..?
ఈ రైళ్లో ప్రయాణించాలంటే ఆక్సిజన్‌ మాస్క్‌లు తప్పనిసరి..?
వాడు నాశనమైపోతారు.. నేల నాకిపోతాడు..!
వాడు నాశనమైపోతారు.. నేల నాకిపోతాడు..!
సెంచరీల్లో సచిన్‌దే పైచేయి.. కానీ ఈ రికార్డులో కోహ్లీనే కింగ్
సెంచరీల్లో సచిన్‌దే పైచేయి.. కానీ ఈ రికార్డులో కోహ్లీనే కింగ్
ఎల్‌బీనగర్‌లో ఓ సంచితో తచ్చాడుతూ కనిపించిన మహిళ.. ఆరా తీస్తే
ఎల్‌బీనగర్‌లో ఓ సంచితో తచ్చాడుతూ కనిపించిన మహిళ.. ఆరా తీస్తే
భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? ఈ కారణాలు తెలుసుకుంటే షాక్ అవు
భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? ఈ కారణాలు తెలుసుకుంటే షాక్ అవు
ఫుల్ ట్యాంక్ చేస్తే 1200 కి.మీ ప్రయాణం.. ఈ కారు సరికొత్త రికార్డు
ఫుల్ ట్యాంక్ చేస్తే 1200 కి.మీ ప్రయాణం.. ఈ కారు సరికొత్త రికార్డు