AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి ఫోన్.. అలా చెప్పడంతో ఒక్కసారిగా కంగారు.. ఆ తర్వాత..

పోలీస్ అధికారులు ఎంత అవగాహన కల్పించిన సైబర్ నేరగాళ్ల కొత్త కొత్త టెక్నిక్ లకు అమాయకులు చిక్కుతూనే ఉన్నారు. అరెస్ట్ పేరిట.. పదకొండు లక్షల రూపాయల రుణం ఇప్పించి.. ఆ రుణాన్ని కొట్టేసిన సైబర్ నేరగాళ్లపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సైబర్ నేరగాళ్ల కోసం ప్రత్యేక గాలింపు చేపట్టారు.

Andhra News: సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి ఫోన్.. అలా చెప్పడంతో ఒక్కసారిగా కంగారు.. ఆ తర్వాత..
Crime News
T Nagaraju
| Edited By: |

Updated on: Feb 02, 2025 | 12:05 PM

Share

పోలీస్ అధికారులు ఎంత అవగాహన కల్పించిన సైబర్ నేరగాళ్ల కొత్త కొత్త టెక్నిక్ లకు అమాయకులు చిక్కుతూనే ఉన్నారు. అరెస్ట్ పేరిట.. పదకొండు లక్షల రూపాయల రుణం ఇప్పించి.. ఆ రుణాన్ని కొట్టేసిన సైబర్ నేరగాళ్లపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సైబర్ నేరగాళ్ల కోసం ప్రత్యేక గాలింపు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నర్సరావుపేట పెద చెరువుకు చెందిన సత్య శ్రీ సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంది.

శనివారం మధ్యాహ్నం సత్య శ్రీకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. తాము నార్కోటిక్స్ అధికారులమని చెప్పుకున్న సైబర్ నేరగాళ్లు.. సత్యశ్రీకి ఒక పార్శిల్ వచ్చిందని ఆ పార్శిల్లో గంజాయి ఉందని చెప్పారు. దీంతో కంగారు పడిన సత్య శ్రీ తనకు ఆ పార్శిల్ కు సంబంధం లేదని చెప్పింది. అయినా వాళ్లు వినకుండా గంజాయి కేసు పెడితే లైఫ్ నాశనం అవుతుందని బెదిరించారు. కేసు పెట్టకుండా ఉండాలంటే పది లక్షల ఇవ్వాలని కూడా చెప్పారు. అయితే తన వద్ద అంత డబ్బు లేదని ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నానని సత్య శ్రీ తెలిపింది. అయితే బ్యాంక్ లో రుణం తీసుకొవాలని వాళ్లు సూచించారు.

నువ్వు చేస్తున్న జాబ్ ప్రకారం పది లక్షల వరకూ రుణం బ్యాంక్ ఇస్తుందని.. ఎవరికి అనుమానం రాకుండా లోన్ తీసుకోవాలని తెలిపారు. దీంతో సత్యశ్రీ ప్రైవేటు బ్యాంక్ ను ఆశ్రయించింది.. వెంటనే ఆన్ లైన్‌లో సంప్రదించి.. పదకొండు లక్షల రూపాయల రుణం పొందింది.

ఆ తర్వాత నార్కోటిక్ అధికారుల పేరుతో మరోసారి ఫోన్ చేసి కేసు పెడతామని బెదిరించి.. ఆ పదకొండు లక్షల రూపాయలను తమ ఖాతాలకు మళ్ళించుకున్నారు. అయితే ఆ తర్వాత తాను మోస పోయినట్లు గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. ఇదంతా సైబర్ నేరగాళ్ల పనేనని గ్రహించిన పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం!ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినాలి
ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం!ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినాలి
గణిత, వైఫై అన్వేషణలకు ఆర్డీవోకు అంతర్జాతీయ గుర్తింపు!
గణిత, వైఫై అన్వేషణలకు ఆర్డీవోకు అంతర్జాతీయ గుర్తింపు!
ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ప్రపంచ రికార్డ్ బద్దలు..!
ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ప్రపంచ రికార్డ్ బద్దలు..!
ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు..అందమే అందం!
ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు..అందమే అందం!
24 గంటల్లోనే మరో గాయం.. హార్దిక్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?
24 గంటల్లోనే మరో గాయం.. హార్దిక్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?
కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు 'బెస్ట్ టైమ్' ఇదే.
కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు 'బెస్ట్ టైమ్' ఇదే.
బాలనాగమ్మ సినిమా చిత్రీకరణ అయినా ఎందుకు రిలీజ్ కాలేదంటే..?
బాలనాగమ్మ సినిమా చిత్రీకరణ అయినా ఎందుకు రిలీజ్ కాలేదంటే..?
నాటు గుడ్డు.. ఫారం గుడ్డు: ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణుల సూచన
నాటు గుడ్డు.. ఫారం గుడ్డు: ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణుల సూచన
భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?
భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?
లియోనెల్‌ మెస్సీ నెట్‌వర్త్‌ చూస్తే కళ్లు తిరగాల్సిందే..!
లియోనెల్‌ మెస్సీ నెట్‌వర్త్‌ చూస్తే కళ్లు తిరగాల్సిందే..!