AP Omicron Case: ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు.. విజయనగరం జిల్లాలో నిర్ధారణ

 ఏపీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తాజాగా ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది.

AP Omicron Case: ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు.. విజయనగరం జిల్లాలో నిర్ధారణ
ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు
Follow us

|

Updated on: Dec 12, 2021 | 12:25 PM

ఏపీలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఎక్కడో మహారాష్ట్ర, గుజరాత్‌లో కాదు. తాజాగా ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ధృవీకరించంది. విజయనగరంలో ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు తెలిపింది. గత నెల 27న ఐర్లాండ్‌ నుంచి ముంబై వచ్చిన 34 ఏళ్ల ప్రయాణికుడికి ముంబైలో ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా.. కోవిడ్‌ నెగెటివ్‌గా వచ్చింది. దీంతో  ముంబై నుంచి సదరు ప్రయాణికుడు విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలానికి  వెళ్లాడు. అక్కడ మరోసారి టెస్ట్ చేయగా ఒమిక్రాన్ సోకినట్లు తేలింది. దీంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. అధికారులు అలెర్టయి… బాధితుడిని ఐసోలేషన్‌లో ఉంచి.. చికిత్స అందిస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందొద్దని వైద్యారోగ్యశాఖ సూచించింది. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించింది. విదేశాల నుంచి వచ్చిన 15 మంది శాంపిల్స్ జీనోమ్ టెస్టింగ్ కోసం పంపితే.. పది శాంపిళ్లకు నివేదికలు అందాయని.. వాటిలో ఒక కేసు మాత్రమే ఒమిక్రాన్‌గా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

Also Read: ఈ ఫోటోలోని చిన్నారి.. హీరోయిన్‌గా టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.. ఎవరో గుర్తించారా..?