AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఇంతటి దుర్మార్గుడు దునియాలో ఉండకపోవచ్చు.. తల్లిదండ్రులను చంపేందుకు సుపారీ..

ఇంతకంటే దుర్మార్గమైన చర్యలు ఈ భూమిపై మరొకటి జరిగి ఉండదు. అవును, నవమాసాలు మోసి జన్మనిచ్చి, సాకిన తల్లిదండ్రులను హతమార్చేందుకు కుట్ర చేశాడు తనయుడు. అయితే, కసాయి..

Andhra Pradesh: ఇంతటి దుర్మార్గుడు దునియాలో ఉండకపోవచ్చు.. తల్లిదండ్రులను చంపేందుకు సుపారీ..
Arrest
Shiva Prajapati
|

Updated on: Oct 29, 2022 | 9:49 PM

Share

ఇంతకంటే దుర్మార్గమైన చర్యలు ఈ భూమిపై మరొకటి జరిగి ఉండదు. అవును, నవమాసాలు మోసి జన్మనిచ్చి, సాకిన తల్లిదండ్రులను హతమార్చేందుకు కుట్ర చేశాడు తనయుడు. అయితే, కసాయి తనయుడి కుట్రను పోలీసులు ముందే పసిగట్టారు. ఆ కుట్రకు చెక్ పెట్టారు. నెల్లూరు జిల్లాలోని కావలిలో వెలుగు చూసింది ఈ ఘటన. విరాల్లోకెళితే.. కావలిలో కన్న తల్లిదండ్రులనే హతమార్చేందుకు సుపారీ గ్యాంగ్‌ను మాట్లాడిన కొడుకును అరెస్ట్ చేశారు. తండ్రిని చంపితే మూడు లక్షలు.. తల్లిని కూడా చంపితే ఐదు లక్షల రూపాయలు ఇచ్చేలా సుపారి కుదుర్చుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఇద్దరిని చంపేందుకు రంగంలోకి దిగిన సుపారి గ్యాంగ్‌.. కావలిలో రెక్కీ నిర్వహించింది. ఆస్తి వివాదాలతోనే హత్యకు ప్లాన్‌ చేసినట్లు గుర్తించారు పోలీసులు.

తండ్రీ కొడుకులు బాలకృష్ణయ్య, లక్ష్మీనారాయణ మధ్య కొంతకాలంగా ఆస్తి వివాదం నడుస్తోంది. సమస్య పరిష్కారం కాకపోవడంతో తల్లిదండ్రులను హతమార్చాలని భావించాడు లక్ష్మీనారాయణ. ఈ క్రమంలో వారిని చంపేందుకు ఓ సుపారీ గ్యాంగ్‌ను కాంటాక్ట్ అయ్యాడు. తల్లిదండ్రులను చంపితే డబ్బులు ఇస్తానంటూ బేరం మాట్లాడాడు. డీల్ ఓకే అవడంతో సుపారీ గ్యాంగ్ కావలిలో కొద్ది రోజులు రెక్కీ నిర్వహించారు. మరోవైపు తల్లిదండ్రులను కడతేర్చేందుకు కత్తులను సిద్ధం చేసి తన కారులో దాచిపెట్టాడు తనయుడు లక్ష్మీనారాయణ. అయితే, అనుమానం వచ్చిన తండ్రి బాలకృష్ణయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కారులో దాచిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీనారాయణతో పాటు సుపారీ గ్యాంగును అరెస్ట్ చేశారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..