AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ నెంబర్ వన్.. రాజ్య సభలో స్పష్టం చేసిన కేంద్ర మంత్రి..

Andhra Pradesh: దేశంలో గతేడాది నుంచి కేంద్ర ప్రభుత్వం సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. దీని ప్రధాన ఉద్దేశ్యం దేశంలో సంప్రదాయ దేశీయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం.

Andhra Pradesh: ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ నెంబర్ వన్.. రాజ్య సభలో స్పష్టం చేసిన కేంద్ర మంత్రి..
Natural Farming
uppula Raju
|

Updated on: Mar 26, 2022 | 5:57 AM

Share

Andhra Pradesh: దేశంలో గతేడాది నుంచి కేంద్ర ప్రభుత్వం సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. దీని ప్రధాన ఉద్దేశ్యం దేశంలో సంప్రదాయ దేశీయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం. ఇందుకోసం ప్రభుత్వం పరంపరగత్ కృషి వికాస్ యోజన (పీకేవీవై) ప్రారంభించింది. దీని కింద ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లోని లక్ష హెక్టార్ల విస్తీర్ణంలో సహజ వ్యవసాయం జరుగుతోంది . ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ శుక్రవారం రాజ్యసభలో వెల్లడించారు. దేశంలో మొత్తం 4 లక్షల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో సహజ వ్యవసాయం జరుగుతోంది. ఇది దాదాపు 8 రాష్ట్రాలలో విస్తరించి ఉంది. ఇందులో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, తమిళనాడు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాల్లో సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రూ.4980.99 లక్షల నిధిని కేటాయించింది. ఈ సందర్భంగా త్వరలోనే దేశంలో సహజ సాగు విస్తీర్ణం 9న్నర లక్షల హెక్టార్లను దాటనుందని వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రాజ్యసభలో వెల్లడించారు. 2021-22 సంవత్సరంలో దేశంలోని 3 రాష్ట్రాల్లో 5.68 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సహజ వ్యవసాయం చేసేందుకు ఆమోదం లభించిందన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 1.5 లక్షల హెక్టార్లు, రాజస్థాన్‌లో 3.8 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్‌లో 0.38 లక్షల హెక్టార్లలో వ్యవసాయానికి అనుమతి లభించిందని తెలిపారు.

సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న పథకం కింద సింథటిక్ రసాయన ఎరువుల వాడకాన్ని నిషేధిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. దాని స్థానంలో, బయోమాస్ మల్చింగ్, ఆవు పేడ-మూత్ర సూత్రీకరణల వాడకం, ఇతర మొక్కల ఆధారిత ఎరువులు వ్యవసాయానికి ఉపయోగిస్తారని పేర్కొన్నారు. సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి నిర్వహిస్తున్న BPKP పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు హెక్టారుకు 12,200 రూపాయల చొప్పున 3 సంవత్సరాలకు ఆర్థిక సహాయం అందిస్తోంది.

Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రత

Oily Skin: ఆయిల్‌ స్కిన్‌ ఉన్నవారు వీటిని అప్లై చేయకూడదు.. ఎందుకో తెలుసుకోండి..!

IPL 2022: ఐపీఎల్‌లో ఇప్పటివరకు అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్లు వీరే..!