Chintamani Natakam: చింతామణి నాటకం నిషేధించడంపై హైకోర్టులో విచారణ.. ప్రతివాదులకు నోటీసులు జారీ..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో చింతామణి నాటకం(Chintamani Natakam) నిషేధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై..

Chintamani Natakam: చింతామణి నాటకం నిషేధించడంపై హైకోర్టులో విచారణ.. ప్రతివాదులకు నోటీసులు జారీ..
Ap High Court
Follow us

|

Updated on: Feb 09, 2022 | 4:40 PM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో చింతామణి నాటకం(Chintamani Natakam) నిషేధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో(AP High Court) విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం(High Court of AP) ముందు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు(MP Raghurama Krishna Raju) వేసిన ఈ పిటిషన్‌పై న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. అదే సమయంలో నిషేధాన్ని సమర్థిస్తూ ఆర్యవైశ్య సంఘాల తరఫున 3 ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇంప్లీడ్ పిటిషన్లపైనా ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, ఇంప్లీడ్ పిటిషన్లపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. 100, 200 పిటిషన్లు వేస్తారా అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. విచారణను సాగదీసేందుకే ఈ ఇంప్లీడ్ పిటిషన్లు వేస్తున్నారా అని ప్రశ్నించింది హైకోర్టు.

సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వేసిన ఇంప్లీడ్ పిటిషన్ ను హైకోర్టు అనుమతించింది. తాము కేవలం అభ్యంతరం ఉన్న పాత్రను మాత్రమే నిషేధించాలని కోరుతున్నామని న్యాయవాది ఉమేష్ చంద్ర కోర్టు్కు తెలిపారు. మొత్తము నాటకాన్ని ఎలా నిషేధిస్తారు అని ప్రశ్నించారు. కన్యాశుల్కం నాటకములో అభ్యంతరాలున్నాయని చెబితే మొత్తం నాటకాన్ని నిషేధిస్తారా అని ప్రశ్నించారు న్యాయవాది. అలాగే రామాయణంలో అభ్యంతరకర పాత్రలు ఉన్నాయని రామాయణాన్ని నిషేదించమంటే ఎలా అని ప్రశ్నించారు న్యాయవాది ఉమేష్. 100 సంవత్సరాల నుంచి ప్రదర్శిస్తున్న నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ప్రశ్నించారు. ఆర్టిస్టుల తరుపున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వేసిన పిటిషన్ కూడా ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కి బదిలీ అయ్యింది. వాదనలను విన్న ధర్మాసనం.. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Also read:

ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ట్రై చేసేవారికి గుడ్‏న్యూస్.. అందులో ప్రోఫైల్ క్రియేట్ చేస్తే ఛాన్స్ మీ వద్దకే.!!

సలలిత రాగసుధారసాన్ని పంచిన సుస్వరాల సుసర్ల.. లతాను తెలుగువారికి పరిచయం చేసింది ఆయనే!

SEBI Officer Grade A 2022: ఫిబ్రవరి 20న జరగనున్న సెబీ 2022 గ్రేడ్‌ ఏ పరీక్షకు హాల్‌ టికెట్లు విడుదల..

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..