AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అలా హామీ ఇస్తే తప్ప తగ్గేదే లే.. ఉద్యమానికి సిద్ధమైన ఉద్యోగులు..

రాష్ట్రంలో ఈనెల 9వ తేది నుంచి ఉద్యోగుల ఉద్యమ కార్యచరణ ప్రారంభమవుతుందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరు తెలిపారు. పిఆర్‌సి, అరియర్స్‌, ఇతర సమస్యలపై ప్రభుత్వం లిఖిత పూర్వకంగా హమీ ఇస్తే..

Andhra Pradesh: అలా హామీ ఇస్తే తప్ప తగ్గేదే లే.. ఉద్యమానికి సిద్ధమైన ఉద్యోగులు..
Bopparaju Venkateswarlu
Shiva Prajapati
|

Updated on: Mar 03, 2023 | 9:16 PM

Share

రాష్ట్రంలో ఈనెల 9వ తేది నుంచి ఉద్యోగుల ఉద్యమ కార్యచరణ ప్రారంభమవుతుందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరు తెలిపారు. పిఆర్‌సి, అరియర్స్‌, ఇతర సమస్యలపై ప్రభుత్వం లిఖిత పూర్వకంగా హమీ ఇస్తే తప్ప తమ ఉద్యమాన్ని ఆపేదిలేదన్నారు. ఇదే విషయాన్ని మంత్రివర్గ ఉపసంఘానికి తేల్చిచెప్పామన్నారు. ఒంగోలులో ఏపీ జేఏసి అమరావతి ఉద్యోగుల సమావేశంలో పాల్గొన్న బొప్పరాజు ఈనెల 9వ తేది నుంచి జరగనున్న ఉద్యామాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తామన్నారు.

ఇది ప్రభుత్వానికి వ్యతిరేక ఉద్యమం కాదని, ప్రభుత్వానికి తన బాధ్యతను గుర్తు చేస్తున్నామన్నారు. సకాలంలో జీతాలు రాక చాలామంది ఉద్యోగులు లోన్‌యాప్‌ల్లో అప్పులు తీసుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురంలో డిఆర్‌డిఏ ఉద్యోగి జీతం లేక డయాలసిస్‌ చేయించుకోలేక చనిపోవడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఇప్పటికే ఇవ్వాల్సినదానికన్నా ఎక్కువ సమయం ప్రభుత్వానికి ఇచ్చామన్నారు. సీఎంకు ఉన్న ఇబ్బందులు, కరోనా కష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వానికి సహకరించామన్నారు. తామిచ్చిన సహకారాన్ని ప్రభుత్వం చులకనగా తీసుకుని చేతకానివారికింద జమ కట్టిందని ఆరోపించారు.

తమకు న్యాయంగా, చట్టబద్దంగా జీతాలు పెంచాల్సి ఉన్నా 11వ పీఆర్‌సీని అమలు చేయలేదన్నారు వెంకటేశ్వర్లు. అంతేకాకుండా 10 వ పీఆర్‌సీ రాయితీలను కూడా కట్‌ చేశారని వాపోయారు. ఇవ్వాల్సిన వాటిలో కోత విధించడం, జీతాలు పెంచకపోవడం, దాచుకున్న డబ్బులు కూడా పొందలేని పరిస్థితులను కల్పించినందునే ఉద్యమానికి సిద్దమయ్యామని స్పష్టం చేశారాయన. 11వ పీఆర్‌సీ అరియర్స్‌ కోసం నాలుగురోజుల క్రితం ఇచ్చిన జీవోలో కూడా తాము రిటైర్‌ అయిన తరువాత ఇస్తారంటున్నారని, ఇది కుట్రకాదా? అని ప్రశ్నించారు. .. కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు లేవని, నిధులు లేవని, పైపెచ్చు ప్రజల్లో చులకన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో శ్రమదోపిడీ జరుగుతోందని ఆరోపించారు వెంకటేశ్వర్లు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!