AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏ ప్రభుత్వం చేయని విధంగా బాధితులను ఆదుకున్నాం.. కోనసీమ పర్యటనలో సీఎం జగన్

గోదావరి (Godavari) వరదలతో అతలాకుతలమైన కోనసీమ (Konaseema) జిల్లాల్లోని ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ సందర్శించారు. వరదల కారణంగా ఎంత వరకు నష్టం జరిగిందనే విషయంపై లెక్కలు రాగానే ప్రజల్ని ఆదుకుంటామని...

Andhra Pradesh: ఏ ప్రభుత్వం చేయని విధంగా బాధితులను ఆదుకున్నాం.. కోనసీమ పర్యటనలో సీఎం జగన్
Cm Jagan Tour In Konaseema
Ganesh Mudavath
|

Updated on: Jul 26, 2022 | 5:16 PM

Share

గోదావరి (Godavari) వరదలతో అతలాకుతలమైన కోనసీమ (Konaseema) జిల్లాల్లోని ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ సందర్శించారు. వరదల కారణంగా ఎంత వరకు నష్టం జరిగిందనే విషయంపై లెక్కలు రాగానే ప్రజల్ని ఆదుకుంటామని వెల్లడించారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా బాధితులను ఆదుకున్నామని పేర్కొన్నారు. పుచ్చకాయలవారి పేట, గంటిపెదపూడి, ఊడుమూడి లంక తదితర గ్రామాల్లో వరద (AP CM Jagan) బాధితులతో మాట్లాడారు. వారిని కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరిస్తామని, పరామర్శించారు. వరద బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా రేపు (బుధవారం) కూడా సీఎం జగన్ పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు రాజమహేంద్రవరం నుంచి బయలుదేరి అల్లూరి జిల్లాలోని చింతూరుకు చేరుకోనున్నారు. ఆక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కన్నయగుట్ట గ్రామం చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన వరద బాధిత గ్రామాల ఫోటో గ్యాలరీని పరిశీలిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారని అధికార వర్గాలు వెల్లడించాయి.

ప్రతి ఇంటికీ నష్టపరిహారం, నిత్యవసరాలు అందించాం. పశువులకు నోరు ఉంటే అవి కూడా మా సహాయాన్ని మెచ్చుకునేవి. మాకు సహాయం అందలేదని ఏ ఒక్కరూ చెప్పలేదు. వరదల్లో నేను వచ్చుంటే ఫోటోల్లో, టీవీల్లో బాగా కనిపించేవాడిని. కానీ నాకు పబ్లిసిటీ అవసరం లేదు. సామాన్య జనం ఇబ్బంది పడకూడదనే వారం రోజులు టైమ్ ఇచ్చి ఇప్పుడు వచ్చాను. ఈ ఏడాదిలోనే పంటలకు నష్టపరిహారం చెల్లిస్తాం.

     – వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

అయితే.. కోనసీమలో భారీ వర్షం కురుస్తున్నా సీఎం జగన్ మాత్రం తన పర్యటనను కొనసాగిస్తున్నారు. వరదల సమయంలో వశిష్ట నదీ పాయ తెగిపోవడంతో లంక గ్రామ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాధితులతో సీఎం జగన్‌ నేరుగా మాట్లాడి, పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. సీఎం జగన్ అరిగెలవారిపేట, ఉడిమూడిలంక, వాడరేవు పల్లిలోని వరద ముంపు బాధితుల కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..