ఉలిక్కపడ్డ అనకాపల్లి.. నగరంలో అనుమానంగా ఇద్దరు విదేశీయుల సంచారం.. కట్చేస్తే..
అనకాపల్లిలో తీవ్ర కలకలం రేగింది. అనుమాన్నాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాకినాడ నుంచి వెళ్తుండగా పట్టుకున్నారు. నిఘా వర్గాల కీలక సమాచారం ఇవ్వడంతో అనకాపల్లి పోలీసులు అలర్ట్ అయ్యారు. పట్టుబడిన వారిలో ఒక వ్యక్తి, బాలిక ఉన్నారు. బంగ్లాదేశ్ బోర్డర్ దాటి భారత్లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. తీవ్ర కలకలం సృష్టించిన ఘటనతో అనకాపల్లి ఉలిక్కిపడింది.

అనకాపల్లిలో తీవ్ర కలకలం రేగింది. అనుమాన్నాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాకినాడ నుంచి వెళ్తుండగా పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో ఓ వ్యక్తి, బాలిక ఉన్నారు. అనకాపల్లి పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నిఘా వర్గాల సమాచారంతో ఓ బాలిక, మరో వ్యక్తి అనకాపల్లి రైల్వే స్టేషన్ పాత బుకింగ్ కౌంటర్ వద్ద ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన వ్యక్తి పేరు విక్రమ్ అలీ అలియాస్ మహమ్మద్ తయ్యబ్గా పోలీసులు గుర్తించారు. ఇతను 2012లో భారత్లోకి చొరబడ్డాడు. ఉత్తర ప్రదేశ్ అలీగడ్లో 10 ఏళ్లపాటు నివాసమున్నాడు. ఆ తర్వాత కాకినాడకు మకాం మార్చిన తయ్యాబ్.. మూడేళ్లుగా కాకినాడలోనే నివాసం ఉంటున్నాడు.
అయితే బంగ్లాదేశీ బాలికను పెళ్లి చేస్తానని నమ్మించి బోర్డర్ దాటించాడు తయ్యబ్. ఆ తరువాత ఆమెను తీసుకోచ్చి రెండు నెలలుగా కాకినాడలోని బంధించాడు. ఈ విషయం తెలుసుకున్న నిగా వర్గాలు ఇద్దరి కదలికలను గమనించారు. వారు కాకినాడ నుంచి అనకాపల్లి వరకు వచ్చినట్టు తెలుసుకొని అనాపల్లి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. విక్రమ్ అలియాస్ తయ్యబ్ సహా ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. విచారించి అసలు విషయాన్ని తెలుసుకున్నారు.
తయ్యబ్ పై ఫోక్సో, ఫారినర్ యాక్ట్, పాస్పోర్ట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు అనకాపల్లి సిఐ ప్రేమ్ కుమార్ తెలిపారు. అలాగే అతన్ని కోర్టులో హాజరుపర్చగా కోర్టు తయ్యబ్కు 14 రోజుల రిమాండ్ విధించిందని తెలిపారు. బాలికను చిడ్రెన్స్ హోమ్కు తరలించామన్నారు. ఈ కేసులో మరికొంత సమాచారం సేకరించేందుకు నిందితుడిని కస్టడీకి తీసుకొనే అంశాన్ని పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పుకొచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
